దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో కృష్ణపట్నంలో ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు వెలుగులోకి వచ్చారు. తాను కరోనాకి ఆయుర్వేద మందు కనిపెట్టానని.. దాని వల్ల కరోనా అంతం చేయవొచ్చని చెప్పారు. ఇక కృష్ణపట్నంలో ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు తయారు చేస్తోన్న ఆయుర్వేద ఔషధంపై సోషల్ మీడియాలో, మీడియాలో భిన్నరకాల చర్చలు జరగడం.. అది కాస్త ప్రభుత్వం దృష్టికి వెళ్లడం జరిగింది. ఆనందయ్య మందు అంశం హైకోర్టు వరకు వెళ్లింది. తర్వాత ఆనందయ్య ఇచ్చే పీ, ఎల్, ఎఫ్ మందులను రోగులు వాడేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది.
కంట్లో వేసే డ్రాప్స్ మినహా మిగిలిన అన్ని రకాల మందులకు అనుమతి ఇచ్చింది. సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 170కి పెరిగింది. తాజాగా ఒమిక్రాన్ గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆనందయ్య చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఒమిక్రాన్పై స్పందించారు.
ఇదీ చదవండి : పవన్ కళ్యాణ్కు మంత్రి పేర్ని నాని సవాల్!
ఒమిక్రాన్కి కృష్ణపట్నంలో, విశాఖలోను మందు పంపిణీ చేస్తానన్నారు. మరి ఆనందయ్య ఒమిక్రాన్ మందు ఇస్తానన్న విషయం పై ప్రభుత్వం ఎలా స్పందించబోతుంది.. గతంలో మాదిరిగా ఈ మందుపై కూడా ఏమైనా పరీక్షలు చేసేందుక సిద్దం అవుతుందా లేదా అన్న విషయం త్వరలో తెలియనుంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.