ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిలాలకు మళ్ళీ వాన గండం పొంచివుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇటీవల ఏపీలో నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు సృష్టించిన బీభత్సం అంతఇంతకాదు. దాని నుంచి ఇంకా తేరుకోక ముందే ఏపీకి మరో తుఫాన్ గండం వచ్చింది. ఈ తుఫాన్ కారణంగా పలు జిల్లాలో పాఠశాలకు సెలవులు ప్రకటించారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు.
ఏపీ వైపు జావద్ తుఫాన్ దూసుకొస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని సమాచారం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి శుక్రవారం మధ్యాహ్నానికి తుఫాన్గా మారే ప్రమాదముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది . ప్రస్తుతం ఈ వాయువు గుండం విశాఖకు నుంచి 770 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు ఉత్తరాంధ్ర-ఒడిశా తీరాల మధ్య తీరం దాటే అవకాశముంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
గోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో గంటకు 100కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈచ సమయంలో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని అధికారు ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.జావద్ తుఫాన్ నేపథ్యంలో ఆయ జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు.
ఇవాల్టి నుంచి విశాఖలో పలు పర్యాటక ప్రాంతాలనూ మూసివేశారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లు రద్దు చేసింది. మరి కొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతుంది.వాతావరణశాఖ..జిల్లాల వారిగా తుఫాన్ ప్రభావం తీవ్రతును తెలిపింది. అత్యంత భారీ వర్షాలు పడే జిల్లాలు: శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం భారీవర్షాలు: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి. సాధారణ వర్షాలు: దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలు.