కరోనా తర్వాత పూర్తి స్థాయిలో థియేటర్లకు జనాలు వస్తున్నారు. ఇటివల విడుదలైన అఖండ, పుష్ప సినిమా థియేటర్ల ముందు హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో మర్ని సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. కానీ ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరను తగ్గించడంతో పెద్ద సినిమాలకు అది సమస్యగా మారింది. దీంతో పలువురు దర్శక నిర్మాతలు, హీరోలు ఈ విషయంపై స్పందిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, నాని ఈ విషయంపై బహిరంగంగానే మాట్లాడిన విషయం తెలిసిందే.
తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కూడా ఈ విషయంపై స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో.. థియేటర్స్ నాకు గుడితో సమానం.. ఎప్పుడు ప్రజలకు ఆనందాన్ని ఇస్తుంటాయి. అలాంటి థియేటర్స్ మూతపడడం చూస్తుంటే గుండె పగిలిపోతుంది. తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మద్దతు చూస్తుంటే సంతోషంగా ఉంది. అదే విధంగా థియేటర్స్ మళ్లీ కళ కళలాడేలా ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.
Every Single Screen Theatre has a 20rs ticket section too.. Cinema Theatres were already in the reach of all sections of people.
The request 🙏🏼 to authorities is to allow a Balcony/Premium section with a Flexible Ticket Rate. Just like in Trains with Different tier compartments.— Nikhil Siddhartha (@actor_Nikhil) December 26, 2021
అలాగే నాకు తెలిసి ప్రతి సింగిల్ స్క్రీన్ థియేటర్ లో రూ. 20 టికెట్ కూడా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు అందుబాటులో ఉండే ధరల్లోనే థియేటర్స్ ఉన్నాయి. మనం ప్రయాణించే ట్రైన్స్ లో వివిధ తరగతులకు చెందిన కంపార్ట్ మెంట్స్ ఉంటాయి కదా.. అలాగే థియేటర్లలోని బాల్కానీ, ప్రీమియమ్ సెక్షన్స్ సీట్స్ కు కాస్త టికెట్ ధర పెంచాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు నిఖిల్. మరి నిఖిల్ కోరికను ఏపీ ప్రభుత్వం మన్నిస్తుందో లేదో చూడాలి. మరి నిఖిల్ ట్వీట్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Theatres are like a temple to me.. Giving joy and happiness to People always. It is heartbreaking to see theatres close down..
Glad and thankful to see the Telangana Govt Support the film industry..Hoping the Ap Govt helps theatres come back to their glory in a similar way 🙏🏼— Nikhil Siddhartha (@actor_Nikhil) December 26, 2021