ఏపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల చైర్మన్ నారాయకు బెయిల్ రద్దు చేస్తూ చిత్తూరు కోర్టు షాకింగ్ తీర్పు ఇచ్చింది. టెన్స్ క్లాస్ ప్రశ్నాపత్రాలు లీకేజీ కేసులో ఇటీవల ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ పిటీషన్ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిత్తూరు కోర్టు నారాయణ బెయిల్ రద్దు చేయడమే కాదు.. నవంబర్ 30 లోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఏడాది ఏపిలో పదవతరగతి పేపర్ లీకేజ్ విషయం సంచలనం సృష్టించింది. దీనిపై సీఎం జగన్ సైతం ఘాటుగా స్పందించారు. అయితే పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజ్ లో మాజీ మంత్రి నారాయణ హస్తం ఉందని చిత్తూరు జిల్లా పోలీసులు హైదరాబాద్ లోని ఆయన నివాసాని కి వెళ్లి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అదే రోజు న్యాయమూర్తి ముందు ఆయనను హాజరు పరిచారు. అదే రోజు ఆయనకు బెయిల్ మంజూరు అయ్యింది. నారయణకు బెయిల్ ఇవ్వడం సమంజసం కాదని.. అది రద్దు చేయాలని చిత్తూరు పోలీసులు కోర్టులో మరో పిటీషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన చిత్తూరు కోర్టు బెయిల్ రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
చిత్తూరు జిల్లా నెల్లేపల్లిలోని హైస్కూల్ లో ఈ సంవత్సరం ఏప్రిల్ 27 న టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీక్ కావడంతో ఏపిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. పరీక్షా పత్రాల లీకేజ్ విషయంలో నారాయణ పాత్ర ఉన్నట్లు చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఎనిమదిమందిని అరెస్ట్ చేయగా.. అందులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కాగా.. మిగిలిన వారు నారాయణ స్కూల్ సిబ్బంది ఉన్నారు. అయితే నారాయణ పోలీస్ ల ఎదుట లొంగిపోతారా.. పై కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకుంటారా అన్న విషయం వేచి చూడల్సిందే.