ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. యితే, అరెస్టయిన కొన్ని గంటలకే చిత్తూరు కోర్టు ఆయనకు బేయిల్ ఇచ్చింది. చిత్తూరు పోలీసుల అభియోగాల్ని తోసిపుచ్చి, వ్యక్తిగత పూచికత్తు కింద వెనువెంటనే బేయిల్ ఇచ్చింది. నారాయణకు దిగువ కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఎగువ కోర్టులో సవాల్ చేస్తామని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. నారాయణకు తెల్లవారు జామున 3.40కి బెయిల్ ఇచ్చారని.. ఇదేదో దేశ భద్రతకు సంబంధించిన విషయమైనట్లు వ్యవహరించారని సజ్జల విమర్శించారు. టెన్త్ పరీక్షల్లో కొన్ని సంస్థలే మాఫియా ముఠాలా తయారై మాల్ ప్రాక్టీస్కు పాల్పడ్డాయని సజ్జల ఆరోపించారు. దానిపైనే అరెస్టుల పర్వం సాగిందని.. దానిలో భాగంగానే నారాయణని అరెస్ట్ చేశారన్నారు. పరీక్ష పత్రం బయటకు రావడం, జగన్ వైఫల్యం అంటూ యాగీ చేశారని…ప్రభుత్వం స్పందించి కఠినంగా వ్యవహరించి నారాయణను అరెస్ట్ చేసిందని తెలిపారు. ఆయనే మంత్రిగా ఉంటే ఇక ఈ అక్రమాలు సాఫీగా జరుపుకునేవారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: RRR: నారాయణ అరెస్టుపై ఎంపీ RRR సంచలన కామెంట్స్!
పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే నేరం జరిగిందని… దాన్ని ఒక వ్యవస్తీకృతం చేశారని సజ్జల ఆరోపించారు. ఇలాంటి నేరాన్ని ఈ సమాజం ఎలా పరిగణించాలి… చూసి చూడనట్లు వదిలేయాలా… ఈ పునాదులపై నారాయణ, చైతన్య లాంటి సంస్థలు పిల్లల బావిష్యత్తుతో ఆటలాడుకుంటుంటే ఎలా వ్యవహరించాలి.. అని సజ్జల ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే తీరు దారుణంగా ఉందని సజ్జల ఆరోపించారు. మాల్ ప్రాక్టీస్ తప్పు కాదు…మా విధానం అది అని చంద్రబాబు చెప్తారా… అని సవాలు చేశారు. నారాయణ అరెస్టులో రాజకీయ కక్ష ఏముందని సజ్జల ప్రశ్నించారు. కుమారుడు వర్ధంతి అని నారాయణ కూడా చెప్పలేదు..పోలీస్ శాఖ తన పని తాను చేస్తోందన్నారు.
ఇది కూడా చదవండి: భార్యను తాకట్టు పెట్టే పరిస్థితి వద్దు, జగన్ పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
నారాయణ ఆదేశాల మేరకు అక్రమాలు చేసినట్లు కళాశాల డీన్ బాలగంగాధర్ పోలీసులకు తెలిపారన్నారు. నారాయణ ప్రమేయం ఉండటం వల్లే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారన్నారు. నారాయణ అరెస్టులో రాజకీయ కక్ష సాధింపు లేదని… రాజకీయ కక్ష సాధింపే అయితే నేరుగా చంద్రబాబునే అరెస్ట్ చేయించేవారన్నారు. నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఫ్యాక్టరీల్లా తయారై విద్యా సంస్థల్లో నేర సంస్కృతిని సజ్జల మండిపడ్డారు. చీడ పురుగులా మారి విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా పరీక్షల వ్యవస్థలో చెద పురుగుల్లా పట్టి మాల్ ప్రాక్టీస్ చేస్తున్నాయని ఆరోపించారు. మాల్ ప్రాక్టీస్లో చైతన్య విద్యాసంస్థల ప్రమేయం కూడా ఉందని.. వారినీ వదిలే ప్రసక్తి లేదన్నారు.
ఇది కూడా చదవండి: Narayana : నారాయణ అరెస్ట్ నుండి బెయిల్ వరకు.. పూర్తి వివరాలు!
పేపర్ లీకేజీ ఘటనతో సంబంధమున్న ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేశామన్నారు సజ్జల. మాల్ ప్రాక్టీస్ వెనుక ఎవరున్నా.. ప్రభుత్వం వదలిపెట్టదని హెచ్చరించారు. మాఫియాలా పని చేస్తున్న ఈ మాల్ ప్రాక్టీస్ పూర్తిగా నారాయణ కనుసన్నల్లోనే జరుగుతోందని సిబ్బంది స్వయంగా చెప్పినా బెయిల్ రావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు సజ్జల. సాంకేతికపరంగా నారాయణ ఛైర్మన్ కాకపోవచ్చని.. ఆయన అల్లుడు ఇప్పుడు ఆ సంస్థలు చూస్తున్నట్లయితే, రేపు ఆయనను అదుపులోకి తీసుకున్నా, టీడీపీ ఇలాగే స్పందిస్తుందా? అని ప్రశ్నించారు సజ్జల. వ్యవస్థను నాశనం చేస్తున్న మాఫియాను కచ్చితంగా అదుపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు సజ్జల. ఈ కేసుపై తప్పకుండా హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎక్కడా వెనక్కు తగ్గదని స్పష్టంచేశారు. సజ్జల చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.