పిల్లలు అందరూ క్లాసులో రూంలో శ్రద్దగా చదువుకుంటున్నారు. ఉన్నట్టుండి పై నుంచి కుప్పలు తెప్పులుగా సీలింగ్ పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక ఆ పిల్లలు ఏడుస్తూ బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఓ చిన్నారి తలకు బలంగా గాయం అవ్వగా, మరో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఏపీలోని విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం అర్చుకునిపాలెం గ్రామం. ఇక్కడే ఉన్న ప్రాథమిక పాఠశాలలో గ్రామంలోని కొంతమంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇక ఎప్పటిలాగే బుధవారం కూడా ఆ పిల్లలు స్కూల్ కు వెళ్లారు. తమ క్లాసు రూంలో తమంతట తాము చదువుకుంటున్నారు. అయితే ఉన్నట్టుండి క్లాస్ రూం సీలింగ్ నుంచి ఒక్కసారిగా సీలింగ్ పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక ఆ చిన్నారులు.. భయంతో ఏడుస్తూ వెంటనే పరుగులు తీశారు.
ఈ ఘటనలో ఓ చిన్నారి తలకు బలంగా గాయం అవ్వగా, మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్కూల్ ఉపాధ్యాయులు గాయపడ్డ చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో విధ్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ఈ ప్రమాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
క్లాస్రూంలో చిన్నారులపై కుప్పకూలిన సీలింగ్ pic.twitter.com/dnMMWGMjyR
— Hardin (@hardintessa143) February 8, 2023