నడి రోడ్డుపై ఏదైనా లోడుతో వెళుతున్న లారీ లాంటి వాహనాలు ఆగిపోవడం లేదా బోల్తా కొట్టడం చూస్తున్నాం. అయితే లారీ బోల్తా కొట్టిన సమయంలో అక్కడ ఉన్న జనాభా.. ప్రమాదానికి గురైన వాహనాల్లో ఉన్న మనుషుల ప్రాణాల కన్నా.. ఏ వస్తువులు ఉన్నాయా అని చూస్తుంటారు. వస్తువులు, చేపలు, కూరగాయల వంటి నిత్యావసర సరుకులైతే.. వెంటనే వెళ్లి తెచ్చుకుంటారు.
నడి రోడ్డుపై ఏదైనా లోడుతో వెళుతున్న లారీ లాంటి వాహనాలు ఆగిపోవడం లేదా బోల్తా కొట్టడం చూస్తున్నాం. అయితే లారీ బోల్తా కొట్టిన సమయంలో అక్కడ ఉన్న జనాభా.. ప్రమాదానికి గురైన వాహనాల్లో ఉన్న మనుషుల ప్రాణాల కన్నా.. ఏ వస్తువులు ఉన్నాయా అని చూస్తుంటారు. వస్తువులు, చేపలు, కూరగాయల వంటి నిత్యావసర సరుకులైతే.. వెంటనే వెళ్లి తెచ్చుకుంటారు. వారు తెచ్చుకోవడమే కాదూ.. చుట్టుప్రక్కల వారిని పిలుస్తారు. ఇక ప్రమాదం గురించి పట్టించుకోకుండా.. దొరికినంత దోచుకో అన్న చందంగా..తీరు మారిపోతుంటుంది. ఇటువంటి ఓ సంఘటనే ఆంధ్రపద్రేశ్లో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో బీరు బాటిల్స్తో వెళ్తున్న ఓ లారీ బోల్తా కొట్టింది. 200 బీరు కేసులతో వెళుతున్న వ్యాన్ కశింకోట మండలం బయ్యవరం వద్దకు రాగానే ప్రమాదానికి గురయ్యింది. సోమవారం మధ్యాహ్నం వ్యాను ఏపీ బేవరేజీస్ కార్పొరేషన్ గోడౌన్ అనకాపల్లి నుంచి నర్సీపట్నానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అందులో కొన్ని బీర్ బాటిల్స్ పగలిపోయాయి. బీర్ బాటిల్స్ ఉన్న విషయం తెలిసిన ఆ చుట్టు ప్రక్కల ప్రజలు.. ప్రమాదాన్ని పట్టించుకోకుండా ఆ సీసాలు తెచ్చుకునేందుకు ఎగబడ్డారు. ఈ విషయం వీరి నుండి మరికొందరికీ పాకింది. ఇక మందు బాబులు రయ్ అంటూ అక్కడికి వచ్చి అందిన కాడికి బీరు సీసాలు ఎత్తుకెళ్లారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవ్వరికీ ప్రాణ నష్టం కలగకపోవడం ఉపశమనం కలిగించే అంశం. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
అనకాపల్లి: వ్యాను బోల్తా.. నేల పాలైన బీరు బాటిళ్లు#Anakapalli #Beers #VehicleAccident #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/i54jrqbEiN
— oneindiatelugu (@oneindiatelugu) June 6, 2023