ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు డేట్ ఫిక్స్ కావడంతో ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగిపోయింది. ఈనెల 7న మంత్రులు రాజీనామా చేస్తారని.. 11న కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తారని గత కొన్ని రోజులుగా ఏపీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వస్తున్న వార్తల నేపథ్యంలో మంత్రి పేర్నినాని కీలక వ్యాఖ్యలు చేశారు.
రవాణా శాఖా మంత్రిగా ఎవరు వచ్చినా తన అభిప్రాయాలు చెబుతానని స్పష్టం చేశారు. ఇకపైనా ఏవైనా సమస్యలు ఉంటే కొత్త మంత్రి వద్దకు, అవసరమేతే సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ అసోసియేషన్తో బహుశా ఇదే తన చివరి సమావేశం కావొచ్చని అన్నారు. తనకు రవాణాశాఖ కేటాయించినప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యానని.. కానీ తనకు అన్ని వర్గాల నుంచి మంచి ప్రోత్సాహం లభించిందని.. నా బాధ్యత సమర్ధవంతంగా నెరవేర్చానని అన్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తుండటంతో కొత్త టీమ్ ను తీసుకోవాలని సీఎం నిర్ణయించుకున్నారు. ఆయన నిర్ణయాన్ని అందరం గౌరవిస్తున్నామని అన్నారు.