దేశంలోని అత్యధిక ఖతాదారులున్న బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ఈ మధ్యకాలంలో తరుచూ ఏదో ఒక సాంకేతిక సమస్యలు తెలెత్తటంతో ఖాతాదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా SBI ఖాతాదారులకు మరో షాకింగ్ వార్తను తెలిపింది. మెయింటెనెన్స్ కారణంగా సమస్యలు వస్తున్నాయని దయచేసి ఖతాదారులకు గమనించగలరని తెలిపింది.
ఇక సమస్యలో భాగంగా అక్టోబర్ 9న 12.20AM నుంచి 02.20AM వరకు 120 నిమిషాలు, దీంతో పాటు అక్టోబర్ 10న 11.20 PM నుంచి అక్టోబర్ 1.20 AM వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు పనిచేయవని పేర్కొంది. సమస్యలో భాగంగా ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలైన యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు పనిచేయవని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలపింది. ఈ కారణంగా బ్యాంక్ ఖాతాదారులకు ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.