మన చుట్టు ఉండే సమాజంలో అనేక రకాల మనుషులు ఉంటారు. ఆర్థికంగా బలంగా ఉన్నవారు ఓ వైపు కనిపిస్తే.. ఆర్థిక బలం కాదు కదా… కనీసం ఆసరకు ఇల్లులేని ఎందరో అభాగ్యులు మరొకవైపు కనిపిస్తుంటారు. ఇక అనాథల పరిస్థితి మరి దారుణంగా ఉంటుంది. అందులోనూ ఎవరు లేని ఒంటరి యువతల కష్టాల గురించి ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ కోవలోకి చెందిన యువతే సోని. ఊహ తెలియని వయసులో ఆమె తండ్రిని కోల్పోయింది. అప్పటి నుంచి కన్న తల్లే అన్నీ తానై పోషిస్తున్న సమయంలో కొన్నేళ్ల కిందట అనారోగ్యానికి గురై కన్నుమూసింది. దీంతో సోనికి కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో మరుగుదొడ్డే ఆమె ఇల్లు అయింది. మరి.. సోని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఫరీద్ పేట గ్రామానికి చెందిన కర్రోళ్ల ఎల్లయ్య, ఎల్లవ్వలు భార్యభర్తలు. వీరికి ఒక్కగానొక్క కుమార్తె సోని. ఆమె చిన్నతనంలోనే ఎల్లయ్య కన్నుమూశాడు. దీంతో సోని బాధ్యతలు ఆమె తల్లి మీద పడ్డాయి. కూలీ పని చేసుకుంటూ కూతుర్ని పోషిస్తూ వచ్చింది ఎల్లవ్వ. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం సోని తల్లి ఎల్లవ్వ అనారోగ్య కారణంతో మరణిచింది. గ్రామస్థుల సహకారంతో సోనికి వాడి గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది. అయితే కొద్ది రోజులకే వివిధ కారణాల వల్ల ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. ఇటీవల ఆమె ఉంటున్న పూరి గుడిసె కూలిపోవడంతో ఉండడానికి చోటు లేక ప్రభుత్వ సహాయంతో నిర్మించుకున్న మరుగుదొడ్డిలోనే సోని నివసం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇరుగుగా ఉన్న ఆ చిన్న మరుగుదొడద్డిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తోంది. ప్రస్తుతం ఆమె బీడీలు చుడుతూ జీవనం సాగిస్తోంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు సోని ఉంటున్న మరుగుదొడ్డి చుట్టూ పాములు, తేళ్లు కనిపించాయి. దీంతో ఎప్పుడు ఏ విషపురుగు కాటేస్తుందోనని ఆమె ఆందోళన చెందుతోంది. స్వచ్చంద సంస్థలు, మానవతావాదులు ముందుకొచ్చి ఆదుకోవాలని సోని వేడుకుంటోంది. మరి.. సోని దీనగాథపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.