కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక డిపో వద్ద రాజు అనే యువకుడు ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న మోరీలో పడిపోయాడు. దీంతో వెంటనే గమనించిన స్థానికులు మిషన్ ల సాయంతో రాజుకు గుచ్చుకున్న ఇనుప చువ్వలను తీసే ప్రయత్నం చేశారు.
ఇది కూడా చదవండి: Hyderabad: కిరాయి మనుషులతో తల్లిని హత్య చేయించిన కొడుకు.. చివరికి ఊహకందని ట్విస్ట్!
ఈ ప్రమదంలో రాజు దవడ భాగం నుంచి తలలోకి ఇనుప చువ్వలు చొచ్చుకెళ్లాయి. ఈ ప్రమాదానికి గురైన రాజు తీవ్ర నరకయాతన అనుభవించాడు. ఇక మోరీలో పడ్డ రాజుని బయటకు తీసిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.