ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్లాలంటే ఎక్కువగా మోటర్ సైకిళ్లను వినియోగించేవారు. ఆరోజుల్లో ఆదాయ మార్గాలు కూడా తక్కువగా ఉండేవి. దాంతో కారు కొనడం అంటే ఓ కల లాగానే భావించేవారు. అయితే ఎందరో కష్టపడి డబ్బులు సంపాదించి.. ఖరీదైన కారులు కొనుగోలు చేస్తుంటారు. కానీ తాజాగా ఓ 18 ఏళ్ల యువకుడు ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.
ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్లాలంటే ఎక్కువగా మోటర్ సైకిళ్లను వినియోగించేవారు. ఆరోజుల్లో ఆదాయ మార్గాలు కూడా తక్కువగా ఉండేవి. దాంతో కార్ కొనుక్కోవడం అంటే ఓ కల లాగానే భావించేవారు. ఊర్లోకి ఎప్పుడన్న ఓ కారు వస్తే చాలు దాన్ని చూసి తెగ సంబర పడిపోయేవారు. కానీ నేటి పరిస్థితుల్లో ప్రజల ఆలోచనా విధానం మారిపోయింది. ఒకరిని మించి ఒకరు లగ్జరీ వస్తువులను కొనుగోలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా నిలదొక్కుకుని విలాసవంతమైన జీవితాలను గడపడానికి ఇష్టపడుతున్నారు.
ఇక నేటికాలంలో యువత విషయానికొస్తే మాత్రం లగ్జరీ కార్లు, లగ్జరీ బైక్ లని కొనడానికి వెనకాడట్లేదు. ఈ క్రమంలో ఓ యువకుడు అతి చిన్న వయస్సులో ఓ లగ్జరీ కారు కొనుగోలు చేసిన వీడియో ఒకటి వెలుగు చూసింది. ఇది చూసిన వారందరూ ఈ కుర్రాడు ఇంత చిన్న వయస్సులో ఇంత కాస్ట్ లీ కారు ఎలా కొన్నాడబ్బా అని ఆశ్యర్యపోతున్నారు. శ్రీనివాస్ రెడ్డి అనే 18 ఏళ్ల కుర్రాడు హైదరాబాద్ లోని ఓ కంపెనీ నుంచి జర్మనికి చెందిన కోటి రూపాయలకు పైగా విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేశాడు. ఈ కారు ధర అక్షరాల రూ.1.29 కోట్లు. కొత్త కారుకు సంబంధించి ఆ యువకుడు విడుదల చేసిన వీడియోను మనం చూడవచ్చు.
ఇక వీడియోను పరిశీలించినట్లైయితే.. కారను కొనుగోలు చేసే సమయంలో షోరూంలో ఆ యువకుడి తోపాటు అతడి కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించలేదు. మరి ఈ కారును తన సంపాదనతో తీసుకున్నాడా? లేదా తల్లిదండ్రులే గిఫ్టుగా ఇచ్చారా? అనేది వెల్లడి కాలేదు. ఆ యువకుడు ఏం చదువుకున్నాడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అన్న విషయాలు తెలియరాలేదు. ఇంతటి ఖరీదైన కారును కొన్న యువకుడి సాహసాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. ఏది ఏమైనా యువత ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని.. వాటి కోసం నిరంతరం కృషి చేయాలి. అలానే కష్టపడి చదివి వారు కన్న కలలు నిజం చేసుకోవాలి. అయితే ఖరీదైన కారు కొనుగోలు చేసిన ఈ యువకుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.