వేద సాయిచంద్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళాకారుడు, జానపదగేయాలను కూడా ఆలపించేవాడు. సాయిచంద్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో తన గానంతో ప్రజలను ఉత్తేజపరిచాడు. తన పాటలతో ప్రజలను ఉత్తేజపరిచేవాడు. తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో చాలా చురుకుగా పాల్గొని తెలంగాణ ప్రజలకు ఉద్యమస్ఫూర్తి రగిలించాడు.
వేద సాయిచంద్ తెలంగాణ సమాజానికి పరిచయం అవసరం లేని పేరు. తన మాట, పాట, శ్వాస అంతా తెలంగాణమే. ఉద్యమ సమయంలో కొన్ని లక్షల మందిని ఆయన పాట కదిలించింది. ఉద్యమానికి ఊపిరి పోసిన కేసీఆర్ సైతం ఎన్నోసార్లు సాయిచంద్ పాటలకు తనకి స్ఫూర్తిని నింపాయని చెప్పారు. ఇక ప్రత్యేక తెలంగాణ సాధించాక కూడా సాయిచంద్ కేసీఆర్ వెనుక అడుగులు వేశారు. బంగారు తెలంగాణ సాధన కోసం రాష్ట్ర సర్కారు ఎలా కష్టపడుతుందో నిత్యం తన పాటలతో తెలియ చెప్పేవారు సాయిచంద్. ఎక్కడ బి.ఆర్.ఎస్ మీటింగ్ ఉన్నా.. అక్కడ సాయిచంద్ పాట ఉండాల్సిందే. అలా తన జీవితం అంతా ఉద్యమానికి, పాటకి, పార్టీకి అంకితం ఇచ్చారు సాయిచంద్. ఇంత కష్టపడ్డ సాయి.. జీవితంలో ఎదుగుతున్న క్రమంలోనే గుండెపోటుతో అకాల మృత్యువు పొందాడు.
సాయిచంద్ 2023 జూన్ 28న సాయంత్రం తన ఫ్యామిలీతో ఫామ్హౌస్కు వెళ్లాడు. అర్థరాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రాగా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో 29న తెల్లవారుజామున 3 గంటల సమయంలో మరణించాడు. తెలంగాణ గిడ్డంగుల కార్పోరేషన్ ఛైర్మన్ అయిన సాయిచంద్ మరణం గులాబీ శ్రేణులు మాత్రమే కాకుండా.. మొత్తం తెలంగాణ సమాజం శోక సంద్రంలో మునిగిపోయింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ వంటి నేతలు సైతం మీడియా ముందే కన్నీరు పెట్టేసుకున్నారు. ఇక సాయిచంద్ భార్య రజనీ కష్టాన్ని, బాధని, వ్యధని, వేదనని మాటల్లో చెప్పలేని పరిస్థితి. ఆమె కూడా ఉద్యమంలో బలంగా పాల్గొన్న గాయని. కానీ.., సాయిచంద్ తో ప్రేమ వివాహం తరువాత ఇంటికే పరిమితం అయ్యింది. భర్త, భర్త పాట తప్ప వేరే లోకం లేకుండా బతికింది. అలాంటిది ఇంత చిన్న వయసులోనే సాయిచంద్ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయేసరికి గుండెలు బాదుకుంటూ రోదించింది. కేసీఆర్ సారూ,, మీరు పిలిస్తే సాయి లేచి వస్తాడు.. ఒక్కసారి పిలవండి సారూ అంటూ ఆమె పెట్టుకున్న కన్నీరు ప్రతి ఒక్కరిని కదిలించింది. ఇలా భర్త కోసం విలపించి విలపించి.. ఓ మారు ఆస్పత్రి పాలు కూడా అయ్యింది. ఇక సాయి కన్నవారి పరిస్థితి దయనీయం.
తెలంగాణ సమాజం కోసం తన జీవితం మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టిన ఉద్యమకారుని కుటుంబం ఇంత కష్టంలో ఉంటే.. కేసీఆర్ చూస్తూ ఊరుకుంటారా? అలా ఉరుకుంటే ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణకి విలువ ఉంటుందా? అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ సాయిచంద్ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు. తగిన స్కిల్ ఉంది కాబట్టే.. సాయిచంద్ భార్య రజనిని వేర్ హౌసింగ్ కార్పొరేష్ ఛైర్మన్గా నియమించారు. నిజానికి ఇది అంతా మెచ్చుకొని తీరాల్సిన నిర్ణయం. కానీ.., కొంతమంది స్వార్ధపరులు ఇలాంటి విషయంలో కూడా రాజకీయాలు చేస్తూ.. తమ వక్రబుద్ధిని చూపెడుతున్నారు. సాయిచంద్ కుటుంబానికి కోటిన్నర కట్టబెట్టాడని కేసీఆర్ ను తప్పు పడుతున్నారు. మరికొంత మంది అయితే.. ఆమెకి అంత డబ్బా? అంటూ తమ కుళ్ళు బుద్దిని బయట పెడుతున్నారు. నిజంగా ఇది నీచ రాజకీయాలకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు. మానవతా కోణంలో చూసినా, తెలంగాణ సెంటిమెంట్ ప్రకారం చూసినా, కార్యకర్తని ఆదుకునే ఓ నాయకుడి విధానంలో చూసినా, ఉద్యమకారుడికి అందాల్సిన అంతిమ గౌరవంగా చూసినా.. ఎలా చూసినా.. సాయిచంద్ కుటుంబానికి కేసీఆర్ చేసింది సరైన న్యాయమే. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.