పొద్దున లేచిన దాని దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదొక సెంటిమెంట్ను ఫాలో అవుతుంటాం. ఇక బయటకు వెళ్లాల్సి వస్తే దేవుడికి దడ్డం పెట్టే దగ్గర నుండి వీధులో ఎదురు వచ్చే మనుషుల వరకు లెక్కలు వేయాల్సిందే.
మనుషులు కొన్ని ఆచారాలు, మూఢ విశ్వాసాలను బలంగా నమ్ముతారు. మంగళవారం కొత్త పనులు ఏమీ చేయరు. శుక్రవారం ఎవ్వరికి అప్పు ఇవ్వరు. అలాగే పొద్దు పోయాక పసుపు, కుంకుమ, చివరకు పెరుగులో తోడు చుక్క కూడా పొరిగింటి వాళ్లకు ఇవ్వరు. పొద్దున లేచిన దాని దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదొక సెంటిమెంట్ను ఫాలో అవుతుంటారు. ఇక బయటకు వెళ్లాల్సి వస్తే దేవుడికి దడ్డం పెట్టే దగ్గర నుండి వీధులో ఎదురు వచ్చే మనుషుల వరకు లెక్కలు గడుతుంటారు. ఇక బయలుదేరే ముందు ఎవ్వరైనా తుమ్మారా.. ఇక అంతే.. కూర్చొని నీళ్లు తాగడమో, లేక కాళ్లు కడుకుని బయలు దేరుతారు.
శుభకార్యానికి వెళుతుంటే తుమ్మాడని తన్నడం గురించి విన్నారా. అదే జరిగింది ఒకరి విషయంలో. పొరిగింటి వాళ్లు ఊరు వెళుతున్నారని తెలియక తుమ్మాడు. అంతే పొట్టు పొట్టు తన్నారు అతడిని. దీంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరింది. వివరాల్లోకి వెళితే ఖమ్మంలోని చింతకాని మండలం పందిళ్ల పల్లిలోని బొందెల సత్యనారాయణ తన ఇంటి సభ్యులతో కలిసి ఈ నెల 13న ఓ శుభకార్యానికి కారులో బయలు దేరారు. వీధిలో నుండి కారు వెళుతుండగా..పప్పుల వీరభద్రం అనే వ్యక్తి.. ఇంట్లో నుండి హచ్ అంటూ తుమ్మడంతో.. ఏదో అపశకునంగా భావించిన సత్యనారాయణ కుటుంబ సభ్యులు ప్రయాణాన్ని ఆపేసేశారు.
తుమ్మిన వీరభద్రం ఇంటికి మీదకు గొడవకు దిగారు. అదేంటీ తన ఇంట్లో ఉండి తుమ్మితే మీకేమీ నష్టం అంటూ వీరభద్రం కూడా ఎదురు తిరిగారు. ఈ విషయంపై పంచాయతీ పెట్టారట. దీనిపై వీరభద్రం వివరణనిస్తూ.. తుమ్ములు అనేటివి చెప్పిరావు, అవి ఎలా ఆపుకుంటాం. అయినా తాను తుమ్మితే..తనపై గొడవకు రావడాన్ని ప్రశ్నించారట. అది కాస్త.. చిలికి చిలికి పెద్ద గొడవగా మారి.. సత్యనారాయణ కుటుంబ సభ్యులు వీరభద్రాన్ని తన్నారట. దీంతో అతడు పోలీస్ స్టేషన్ ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.