వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఐసీయూ లో శ్రీనివాస్ అనే రోగిని ఎలుకలు కొరుక్కుతిన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో అర్ధరాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేకెత్తించింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ ని ఎలుకలు కరవడంతో వెంటనే మెరుగైన వైద్యం కోసం ఆయనను వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. కానీ అతని శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో చనిపోయినట్లు నిమ్స్ వైద్యులు వెల్లడించారు.
హనుమకొండకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి బంగారం షాపులో గుమస్తాగా పని చేస్తున్నాడు. శ్రీనివాస్ కాలేయం, కిడ్ని సంబంధిత వ్యాదితో మార్చి 26న ఎంజీఎంలో చేరాడు. ఇటీవల ఆయన పరిస్థితి దారునంగా మారింది.. దీంతో శ్రీనివాస్ ని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆయనను రెండుసార్లు ఎలుకలు కొరికాయి.. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
శ్రీనివాస్ వేలుకి తీవ్ర రక్తస్రావం కావడం ఆయన భార్య గమనించి వైద్యులకు చెప్పింది. వెంటన అతన్ని పరీక్షించిన వైద్యులు ఎలుకలు కరచినట్టు తేల్చారు. దీనిపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు సూపరింటెండెంట్ శ్రీనివాసరావుపై బదిలీ వేటువేసింది. మరో ఇద్దరు డాక్టర్ల పైనా కఠిన చర్యలు తీసుకుంది. శ్రీనివాస్ మృతిపై వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు. శ్రీనివాస్ అనే వ్యక్తి పూర్తి అనారోగ్యంతో ఉన్నాడని.. అతన్ని ఎలుకలు కొరకడం వల్ల చనిపోలేదని, కార్డియాక్ అరెస్ట్తోనే చనిపోయారని తెలిపారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారని అన్నారు.