వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఐసీయూ లో శ్రీనివాస్ అనే రోగిని ఎలుకలు కొరుక్కుతిన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో అర్ధరాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేకెత్తించింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ ని ఎలుకలు కరవడంతో వెంటనే మెరుగైన వైద్యం కోసం ఆయనను వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. కానీ అతని శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో చనిపోయినట్లు నిమ్స్ వైద్యులు వెల్లడించారు. […]