గత పదిహేను రోజులుగా హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచేత్తుతున్నాయి. దీంతో నగర వాసులకు ప్రత్యేకించి ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అంతేకాదు జోనల్ వారీగా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
గత పదిరోజులుగా హైదరాబాద్ నగరాన్ని వాన కుదిపేస్తుంది. ఇప్పటి వరకు కురిసిన భారీ వర్షాలకు నగరం తడిసిముద్దయ్యింది. దీంతో హైదరాబద్ నగరవాసులకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఐటీ సంస్థలకు పోలీసులు లాగౌట్ అడ్వయిజరీ ఇచ్చారు. అవసరం అయితే తప్ప బయటకు రావొద్దంటు అంటూ హైదరాబాద్ వర్షాలపై.. మొబైల్ యాప్ ద్వారా ప్రజలకు అలర్ట్ మెసేజ్ లను ఎప్పటికప్పుడు అధికారులు పంపుతున్నారు. ఈ రోజు, రేపు హైదరాబాద్ కు భారీ వర్షం పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదారాబాద్ లో పదిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరవాసులు హడలిపోతున్నారు. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ముసురుతో కూడుకున్న వర్షాలతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ అంతరాయం కలగడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నేడు, రేపు హైదరాబాద్ కు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఈ క్రమంలోనే రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే హుస్సేన్ సాగర్ గరిష్ట నీటిమట్టానికి చేరుకుంది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జీహెచ్ఎంసీ అప్రమత్తం అయ్యింది.. డీఆర్ఎష్ బృందాలు రెడీ చేసింది. హైాదరాబాద్ లోని చార్మినార్, ఎల్సీనగర్, శేర్ లింగంపల్లి, ఖైరతాబాద్ జోన్ పరిధిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కూకట్ పల్లి జోన్ కి ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
నగర వాసులు మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఉద్యోగులు ఆఫీసుల నుంచి త్వరగా వెళ్లడం మంచిదని అని సూచిస్తున్నారు. వర్షం కారణంగా వివిధ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని.. దీంతో ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని.. అందుకే త్వరగా అలర్ట్ అయితే బాగుంటుందని సూచిస్తున్నారు. మరోవైపు ఐటీ కారిడార్ లో దశలవారిగా లాగ్ అవుట్ ని అమలు చేయాలని నిర్ణయించింది పోలీస్ శాఖ. కారిడార్ ని మూడు భాగాలుగా విభజించి ఆయా కంపెనీల్లో ఒకేసారి కాకుండా గంటల వ్యవధిలో లాగ్ అవుట్ అమలు చేయడం వల్ల రోడ్లపై వాహనాల రద్ద తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు పోలీస్ శాఖ ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలకు సూచించింది. ప్రస్తుతం హైదరాబాద్ లో నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఎవరూ బయటకు రావొద్దని.. రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షంతో పాటు భారీగా గాలులు వీస్తాయని తెలిపింది. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ అంటే అతి భారీ వర్షాల సూచన జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.
#26JULY 1PM⚠️
LPA effect slowly Starting Now in East #Telangana.
Light showers/Drizzles to continue in #Hyderabad till evening.
L.P. A will Further intensify tonight into Depression 🌀, Massive Rains Expected from tonight in East & Central Telangana ⚠️#HyderabadRains pic.twitter.com/0O0jDPENEp
— Hyderabad Rains (@Hyderabadrains) July 26, 2023