దేశ వ్యాప్తంగా ప్రజలు దీపావళి పండగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. పండగ రోజు ఉదయాన్నే తల స్నానాలు చేసి అనంతరం కొత్త దుస్తులు ధరించి లక్ష్మిదేవికి పూజలు నిర్వహించారు. ఇక సాయంత్ర సమయంలో ఇంటిని దీపాలతో అలకరించారు. కొత్త బట్టలు ధరించి వివిధ రకాల క్రాకర్స్ ను కాల్చారు. ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. కుటుంబ సభ్యులు అందరూ ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఇలా దేశమంతా ప్రజలు తమ ఇళ్ల ముందు దీపావళి వేడుకలు జరుపుకుంటే..ఓ గ్రామ ప్రజలు మాత్రం శ్మశానంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. మరి… ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
దీపావళి వేళ ప్రజలందరూ లక్ష్మిదేవిని భక్తి శ్రద్దలతో ఆరాధిస్తారు. ఏ ఇళ్లు చూసిన దీపాలతో, విద్యుత్ కాంతులతో సుందరంగా అలకరించి.. సంబరాలు చేసుకుంటారు. కానీ కరీనంగర్ లో మాత్రం శ్మశనాంలో దీపావళి వేడుకలు నిర్వహించుకునే విచిత్రమైన ఆచారం ఉంది. ఆరు దశాబ్దాల నుంచి శ్మశాన వాటికలోనే దీపావళి వేడుకలు నిర్వహించే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. కరీంనగర్ లోని కాకణ గడ్డ హిందూ శ్మశాన వాటికలో ఏటా ఈ వేడుకలు జరుగుతాయి. పండగకు వారం రోజుల ముందే శ్మశన వాటికను శుభ్రం చేసి సమాధులకు రంగులు వేస్తారు. ఇక పండగ రోజు కుటుంబ సభ్యులు సమాధుల వద్దకు వెళ్లి వివిధ రకాల పూలతో అలరిస్తారు. సాయంత్ర వరకు అక్కడే గడుపుతారు.
ప్రతి ఏడాది ఇలానే శ్మశానానికి వచ్చి.. ఇష్టమైనవి వండుకుని తినేసి వెళ్లడం జరుగుతుందిని స్థానికులు తెలిపారు. చనిపోయిన కుటుంబ పెద్దలకు నివాళ్లు అర్పిస్తూ, వారిని స్మరించుకునేందుకు ప్రతి ఏటా దీపావళి శ్మశానంలో జరుపుకుంటామని, అన్ని కులాల వారు ఈ శ్మశాన వాటికలో వేడుకలు జరుపుకుంటారని స్థానికులు చెబుతున్నారు. తమ కుటుంబ సభ్యులు లోకం విడిచి వెళ్లిన.. తమతోనే ఉన్నట్లు భావించి.. పటాకులు కాల్చుకుంటామని వారు తెలిపారు. చనిపోయిన వారికి ఇష్టమైనవి వండి పెట్టి, వారి సమాధులు ముందు టపాసులు కాల్చితే .. వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని ఇక్కడి వారు నమ్ముతారు.