నిత్యం అనేక రకాల ప్రమాదాలు చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాము. ఈ ప్రమాదాలకు కారణాలు ఏమైనప్పటికి చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే అప్పుడప్పుడు తృటిలో భారీ ప్రమాదాల నుంచి ప్రాణలతో బయటపడిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి ఘటనలు చూసినప్పుడు ఒళ్లు గగ్గురు పుడుతుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. గాఢ నిద్రలో ఉన్న ఓ కుటుంబ ఇంటిపై భారీ గ్రానైట్ రాయి పడింది. పెను శబ్ధం రావడంతో ఉల్కికి పడిలేచిన కుటుంబ సభ్యులు భయంతో బయటకి పరుగులు తీశారు. ఇంటి బయటకు రాగానే కళ్ల ముందు భారీ గ్రానైట్ రాయి కనిపించింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణపాయం జరగలేదు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో భారీ ప్రమాదం తప్పింది. టన్నుల కొద్ది బరువైన గ్రానైట్ రాయి పడటంతో ఇళ్లు కుప్పకూలిపోయింది. లారీలో తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే గ్రానైట్ రాయి ఇంటిపై పడే సమయంలో అందులో ఐదుగురు నిద్రిస్తున్నారు. భూకంపం వచ్చినట్లు శబ్ధం రావడంతో ఇంట్లో నిద్రిస్తున్న వారందరు ఒక్కసారిగా ఉల్కిపడి లేచి.. బయటకు పరుగులు తీశారు. ప్రాణ భయంతో ఇంటి నుంచి బయటకి వచ్చే సమయంలో వారికి భారీ గ్రానైట్ రాయి కనిపించింది. ఇంటి కన్న పెద్దగా ఉన్న ఆ భారీ రాయిని చూసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. లారీ లో నుంచి గ్రానైట్ రాయి పడటంతో ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నది.
రాయి పడిన ప్రాంతంలో ఇంటి గోడలు కూలిపోయాయి. ఆ బండరాయి కాస్తా పూర్తిగా ఇంటిపై పడి ఉంటే.. ఆ కుటుంబ సభ్యులు ప్రాణ కోల్పోయేవారు. ఇక ప్రమాదం ఘటనపై కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చుట్టుపక్కల పరిశీలించారు. ఇలా కొందరు నిర్లక్ష్యంగా పెద్దపెద్ద బండరాళ్లను తరలిస్తూ గ్రామస్థుల ప్రాణాలకు హాని కలిగిస్తున్నారని స్థానికులు వాపోయారు. ఆ బండరాయి పూర్తిగా ఇంటిపై పడి ఉంటే మా పరిస్థితి ఎంటనే కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.