సీఎం బహిరంగ సభకు ఆయుధాలతో వచ్చారంటే.. అనేక అనుమానాలు వ్యక్తం అవుతాయి. తాజాగా ఏప్రిల్ 14న కేసీఆర్ హాజరైన బహిరంగ సభకు కొందరు ఆయుధాలతో రావడం కలకలం రేపుతోంది. ఆ వివరాలు..
ప్రస్తుతం మీడియాలో వస్తోన్న ఓ వార్త చూస్తుంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హత్యకు ప్లాన్ చేశారా అన్న అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి. సీఎం హత్యకు ప్లాన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మరి ఇలాంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అంటే.. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ దేశంలోనే అత్యంత ఎత్తైన భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు వచ్చిన కొందరు వ్యక్తుల దగ్గర రైఫిల్, తుటాలు, పిస్తోల్ ఉండటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దాంతో.. ఇలాంటి అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. ఇంతకు ఏం జరిగింది అంటే..
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈనెల 14న హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో 125 అడుగుల ఎత్తైన భారీ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్, అంబేద్కర్ మనుమడితో కలిసి విగ్రహావిష్కరణ చేయగా.. అనంతరం అక్కడ సభ ఏర్పాటు చేశారు. అయితే సభకు ఆయుధాలతో వచ్చిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో వీవీఐపీలు ఉన్న సమయంలో ఓ వ్యక్తి రైఫిల్తో లోపలికి వచ్చేందుకు ప్రయత్నించాడు. ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. అతడిని లోపలికి అనుమతించలేదు. దీంతో అతడు రైఫిల్ను తన యజమాని కారులో ఉంచి పిస్తోల్తో సభలోకి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత కారు డ్రైవర్ రైఫిల్తో బయటకు రావటంతో అక్కడున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాను ఖైరతాబాద్కు చెందిన దొండ్ల మధు యాదవ్ డ్రైవర్నని, ఆయధం మధు యాదవ్ గన్మెన్దని చెప్పడంతో, అప్పటికే సభలోకి వెళ్లిన వారిద్దరిని వెనక్కి పిలిపించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు గన్మెన్ వద్ద నుంచి పాయింట్ 315 బోర్ రైఫిల్, 50 తూటాలు, పాయింట్ 32 పిస్తోలు, 44 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. సీఎం సభకు.. ఇలా ఆయుధాలతో రావడం సంచలనంగా మారింది. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.