సమాజంలో గురువులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. విద్యార్థుల ఉన్నతంగా తీర్చి దిద్దడంలో వారిదే కీలక పాత్ర. విద్యార్థులకు గురువులే ఆదర్శంగా నిలబడాలి.చాలా మంది ఉపాధ్యాయులు విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తున్నారు. కానీ కొందరు ఉపాధ్యాయు చేసే పని గురువు స్థానాన్నికి మాయని మచ్చ తెస్తుంది. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, విపరీతంగా కొట్టం వంటివి అనేక ఘటనలు జరుగుతున్నాయి.అయితే తాజాగా ఓ ఉపాధ్యాయుడు పూటుగా మద్యం తాగా పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేషన్ కి వెళ్లాడు. విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు ఫిర్యాదుతో అధికారులు రంగంలోకి దిగి సదరు పంతులుగారిపై చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు గత సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈక్రమంలో మంగళ వారం సెకండ్ లాంగ్వేజ్ పేపర్ పరీక్ష జరిగింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రాంపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్ లో రవికుమార్ అనే వ్యక్తి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఐతే పదో తరగతి పరీక్షల నిమిత్తం హుజూరాబాద్ లోని బాలిక ఉన్నత పాఠశాలో ఇన్విజిలేటర్ గా వెళ్తున్నారు. మంగళవారం కూడా విధులకు హాజరయ్యాడు. ఈ క్రమంలో జిల్లా విద్యాధికారి జనార్ధన్ రావు తనిఖీకి అక్కడి వెళ్లారు. రవికుమార్ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. సదరు టీచర్ ను ప్రశ్నించగా మద్యం వాసన వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేస్తే.. మద్యం స్థాయి ఏకంగా112 పాయిట్లు చూపించింది.
ఇదీ చదవండి: దేశంలోనే మొదటి సారి.. తెలంగాణలో పులుల కోసం ఓ వంతెన
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నత విద్యాధికారి ..విధుల్లో మద్యం తాగొచ్చాడు అనే కారణంగా వెంటనే రవికుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అతని తోపాటు విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నాడని పరీక్ష కేంద్రానికి సూపరిండెంట్ గా ఉన్న అధికారిపై కూడా అధికారులు వేటు వేశారు. నిన్న జరిగిన సెంకడ్ లాగ్వేంజ్ పరీక్షకు ఐదుగురు ఫ్లైయింగ్ సూపర్ వైజర్లు రాష్ట్ర వ్యాప్తంగా 29 పరీక్ష కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దీంతో ఈ వ్యవహరం బయటపడింది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.