సాధారణంగా బ్యాంకు లో రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించకపోతే బ్యాంకు వారు ఆస్తులు జప్తు చేస్తారన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో బ్యాంకు అధికారులు ఎవరి మాట వినరు అన్న విషయం తెలిసిందే. కానీ ఓ చోట రికవరీ కోసం వెళ్లిన బ్యాంకు ఉద్యోగులు రుణం తీసుకున్న వ్యక్తి దీనావస్థ చూసి వారే పూర్తిగా రుణం చెల్లించే బాధ్యత తీసుకున్నారు.. అంతే కాదు ఆ వ్యక్తికి ఇంటినిర్మాణానికి డబ్బులు కూడా ఇచ్చారు. కేరళలోని కోజికోడ్ జిల్లా కప్పాడ్ ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కోజికోడ్ జిల్లా కప్పాడ్ కు చెందిన శశి బ్యాగుల తయారీ పరిశ్రమ స్థాపించేందుకు ఎస్బీఐ నుంచి రూ.50 వేల రుణం తీసుకున్నాడు. ఇటీవల శశి పక్షవాతానికి గురికావడంతో ఆర్థిక పరిస్థితి క్షీణించింది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణం చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. వడ్డీతో సహా ఆ రుణం రూ.70 వేలకు చేరుకొంది.
ఇది చదవండి: గాయత్రి చనిపోవడానికి ముందు ఏం జరిగింది..?
ఈ క్రమంలో ఎస్బీఐ అధికారులు శశి ఇంటిని జప్తు చేసేందుకు వెళ్లారు.. కానీ అక్కడ పరిస్థితి చూసి షాక్ తిన్నారు. పక్షవాతంతో బాధపడుతున్న శశి పరిస్థితి, కూలిపోయే స్థితిలో ఉన్న పాత ఇల్లు, వృద్ధురాలైన అతడి తల్లి దీన స్థితి వారిని కదిలించివేశాయి. ఎప్పుడు కూలిపోతుందో తెలియని ఆ ఇంట్లోనే శశి అనారోగ్యంతో బతుకీడుస్తున్న దృశ్యం చూసి వారి హృదయం ద్రవించిపోయింది. శశి బ్యాంకుకు చెల్లించాల్సిన రూ.70 వేలను ఆ బ్యాంకు ఉద్యోగులే చెల్లించారు. అంతేకాదు, తమ డబ్బుతోనే శశి ఇంటిని బాగుచేయించారు. రుణం వసూళ్లు చేయడంలో కఠినంగా ఉండే బ్యాంకు ఉద్యోగులు ఇంత మంచి మనసు చాటు కోవడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వారిపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.