ఈ మద్య కాలంలో రాజకీయ నేతలు తమ మానవత్వాన్ని చాటుకుంటూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నారు. రోడ్డు పై ప్రమాదానికి గురి అయిన వారిని తమ సొంత కారులో ఆసుపత్రికి తరలించి మరీ వారి ప్రాణాలు కాపాడుతున్నారు. టీడీపీ మహిళా నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మానవత్వాన్ని చాటుకున్నారు. కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం వెంకటాపురం వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి కారు దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వెళుతున్న భూమా అఖిలప్రియ ప్రమాదం గురించి తెలుసుకుని తన వాహనం ఆపారు. గాయపడ్డ వారి పరిస్థితి చూసి భూమ అఖిల ప్రియ వెంటనే తన బాధితులను ఎక్కించి నంద్యాలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని సకాలంలో ఆసుపత్రికి తరలించిన భూమా అఖిలప్రియను స్థానికులు అభినందిస్తున్నారు.
టిడిపి మహిళా నేత, మాజీ మంత్రి @bhuma_akhila సత్వర స్పందనతో క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రిలో చేర్చి మానవత్వం చాటారు. కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం వెంకటాపురం వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది. అంబులెన్స్ కి సమాచారం ఇచ్చినా సకాలంలో రాలేదు.(1/2) pic.twitter.com/kimMUjsSXf
— Telugu Desam Party (@JaiTDP) April 10, 2022