సాయిచంద్ గారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కోటిన్నర రూపాయలతోపాటు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా రజిని సాయిచంద్ గారిని సీఎం కేసీఆర్ నియమించినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
ప్రముఖ ఉద్యమ గాయకుడు, జానపద కళాకారుడు సాయిచంద్ ఇటీవల జూన్ 29న హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే. సాయిచంద్ అకాల మరణంతో ఆయన కుటుంబసభ్యులు, పార్టీ నేతలు కన్నీరుమున్నీరయ్యారు. సాయిచంద్ భార్య తన భర్త మరణాన్ని తట్టుకోలేక గుండెలవిసేలా రోదిస్తుంది. ఇలా విషాదంలో నిండిన ఫ్యామిలీలో మరో షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చింది. సాయిచంద్ భార్య రజినికి గుండెనొప్పి రావడంతో మొదట బీఎన్ రెడ్డి నగర్ లోని కోణార్క్ డయాగ్నోస్టిక్స్ కేంద్రానికి తీసుకుని వెళ్లారు. అక్కడ పరీక్షల అనంతరం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె కోలుకుంటున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తన పాటలతో ఉద్యమకారును ప్రోత్సహించిన వ్యక్తి సాయిచంద్. తన జానపద పాటలతో పలు టీవీ షోలలో కూడా పాల్గొన్నారు.
మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో తన గానంతో కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ఉద్యమ స్ఫూర్తి కల్పించారు సాయిచంద్. పట్టణాలు, పల్లెల ప్రజలను తెలంగాణ పాటలతో కదిలించారు. ఇంత చిన్న వయసులోనే ఆయన మరణం కుటుంబ సభ్యులే కాదు.. ప్రతి తెలంగాణ పౌరుడు జీర్ణించుకోలేకపోతున్నారు. సాయిచంద్ గారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కోటిన్నర రూపాయలతోపాటు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా రజిని సాయిచంద్ గారిని సీఎం కేసీఆర్ నియమించినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్గా పని చేశాడు. ఆయన సేవలను మర్చిపోలేం అని కేటీఆర్ అన్నారు.