బిడ్డలు పుట్టగానే తండ్రికి సంతోషం కలగదు. సమాజంలోని ప్రజలు తన బిడ్డను మెచ్చిన రోజుననే నిజమైన సంతోషం కలుగుతుంది. అలాంటి సంతోషం ఓ రాష్ట్ర డీజీపీకి కలిగింది. ఆయన డీజీపీగా ఉండగా.. ఐపీఎస్ అయిన తన కూతురు వచ్చి సెల్యూట్ చేసింది.
బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులకు సంతోషం కలదు.. సమాజంలో వారు ఉన్నత స్థానానికి వెళ్లి.. మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించిన రోజు నిజమైన సంతోషం కలుగుతుంది. తమ బిడ్డలు ఉన్నత స్థితికి చేరుకుని, అందరూ వారిని పొగడుతూ ఉంటే తమ జన్మధన్యమైందని ఆ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తుంటారు. అందుకే బిడ్డల భవిష్యత్తు కోసం రేయింబవళ్లు కష్టపడుతుంటారు. తమ సంతోషాలను వదిలేసి.. పిల్లల చదువుల కోసం డబ్బులను ఖర్చు పెడుతుంటారు. ఇలా తాము ఎన్ని కష్టాలు అనుభవించిన బిడ్డలు ప్రయోజకులు అవుతే ఆ కష్టానంతటిని మరచి పోతారు. ఇది కేవలం సామాన్య ప్రజలకే కాకుండా ఉన్నత స్థానంలో ఉండే అధికారులకు ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్లో జరిగింది. తండ్రి డీజీపీ కాగా, కూతురు ట్రైనీ ఐపీఎస్ గా ఉండి.. ఒకరికొక్కరు సెల్యూట్ చేసుకున్నారు. ఈ అరుదైన దృశ్యానికి హైదరాబాద్ పోలీస్ అకాడమీ వేదిక అయ్యింది.
కన్నబిడ్డలు ఉన్నత స్థానంలో స్థిరపడితే చూడాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాంటి పుత్రోత్సాహం అనుభవించారు అస్సాం రాష్ట్ర డీజీపీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. ఫిబ్రవరి 11న హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో పాసింగ్ ఔట్ పరేడ్ పూర్తయిన సంగతి తెలిసింది. ఈక్రమంలో పలువరు ట్రైనీ ఐపీఎస్ లో తమకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లి రిపోర్టింగ్ చేశారు. అయితే ట్రైనీ ఐపీఎస్ లో పాసింగ్ పరేట్ సమయంలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది.
అస్సాం డీజీపీ కుమార్తె ఐశ్వర్య సింగ్ కూడా ఈట్రైనీ ఐపీఎస్ ల్లో ఒకరు. ఆమెకు ఇటీవలే ఐపీఎస్ శిక్షణ పూర్తి చేశారు. పాసింగ్ పరేడ్ అనంతరం డీజీపీ హోదాలో ఉన్న తన తండ్రి జీపీసింగ్ వద్దకు వెళ్లి.. ఐశ్వర్య సింగ్ సెల్యూట్ చేశారు. ఈ మధురమైన దృశ్యాన్ని వీడియో తీసిన ఎన్పీఎస్ సిబ్బంది జీపీ సింగ్కు పంపారు. దీంతో ఆయన ఆ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. “ఇది మాటల్లో వర్ణించలేని సందర్భం, ట్రైనీ ఐపీఎస్గా నా కూతురి నుంచి గౌరవ వందనం స్వీకరించా” అంటూ అందులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వేలాది మంది ఈ వీడియోకు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ ఏడీజీ స్వాతిలక్రా కూడా వీడియోపై స్పందించారు. “తండ్రీకూతురు ఇద్దరికీ ఇవి మధుర క్షణాలు.. ఇద్దరికీ కంగ్రాట్స్” అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికి ఐదున్నర లక్షలమంది వీక్షించారు. కేవలం సామాన్యులే కాదు ఉన్నతాధికారులు అయిన తమ గారాల బిడ్డలు గొప్ప స్థితిలో ఉండి.. తమ ముందుకు సెల్యూట్ చేస్తే.. ఆ మధుర క్షణాలు మాటల్లో వర్ణించలేరు. మరి.. ఈ అపురూప దృశ్యంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Words fail me. Received the salute from daughter @aishwarya_ips as she passed out of @svpnpahyd today. Picture courtesy @lrbishnoiips pic.twitter.com/aeHoj9msYG
— GP Singh (@gpsinghips) February 11, 2023