డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు తెలంగాణా ఆర్టీసీ షాక్ ఇచ్చింది. సాధారణ ప్రయాణికులు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు రాయితీపై జారీ చేసే బస్పాస్ చార్జీలను ఆర్టీసీ భారీగా పెంచింది. కొత్త ధరలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి. ఇంక బస్ పాస్ చార్జీల వివరాల విషయానికి వస్తే.. జనరల్ బస్ టికెట్ పాసులు భారీగానే పెరిగాయి. ఈ కేటగిరీలో ఆర్డినరీ పాస్ చార్జీ రూ.950 నుంచి రూ.1150కి, మెట్రో ఎక్స్ప్రెస్ రూ.1,070 నుంచి రూ.1,300కు, మెట్రో డీలక్స్ రూ.1,185 నుంచి రూ.1,450కి, మెట్రో లగ్జరీ రూ.2 వేల నుంచి రూ.2,400కు, పుష్పక్ పాస్ రూ.2,500 నుంచి రూ.3 వేలకు పెంచింది.
అలాగే NGOs బస్ పాస్ లకు సంబంధించి ఆర్డీనరీ పాస్ చార్జీ రూ.320 నుంచి రూ.400 కు, మెట్రో ఎక్స్ ప్రెస్ రూ.450 నుంచి రూ.550 కి, మెట్రో డీలక్స్ రూ.575 నుంచి రూ.700 కు, ఎంఎంటీఎస్ – ఆర్టీసీ కాంబో టికెట్ చార్జీ రూ.1090 నుంచి రూ.1350 కి పెరిగింది. ఇటీవలే సెఫ్టీ సెస్ పేరుతో టికెట్ పై రూపాయి పెంచి, చిల్లర సమస్య రాకుండా ధరను రౌండప్ గా చేయటంతో గరిష్టంగా టికెట్ ధర రూ.5 మేర పెరిగింది. మరి.. పెరిగిన ఈ ఆర్టీసీ బస్ పాస్ చార్జీలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.