ఇటీవలి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్ని వర్షాలు ముంచెత్తిన సంగతి మనకు తెలిసిందే. దాంతో ఊరూ.. వాడ.. అన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. దాంతో చాలా వరకు విష ప్రాణులు ఆ వరదల్లో ఊర్లల్లోకి, పొలాల్లోకి కొట్టుకొచ్చిన సంఘటనలు మనం చాలానే చూశాం. తాజాగా అలాంటి భారీ ప్రాణే పొల్లాల్లో కనిపించిన సంఘటన వనపర్తి జిల్లాల్లో చోటు చేసుకుంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
అది వనపర్తి జిల్లా అమరచింత మండలం ఈర్లదిన్నెలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఈర్లదిన్నె గ్రామానికి చెందిన రైతు నరసింహులు తన వరి పొలంలో కూలీలతో కలుపు తీపిస్తున్నాడు. కూలీలందరూ పాటలు పాడుతూ వారి పనిలో నిమగ్నమై పోయారు. ఇంతలో వారి ముందర ఏదో భారీ శబ్దం వినిపించింది. ఏదో కదులుతున్నట్లు వారు గమనించారు.
భయం భయంగానే దానివైపు అడుగులు వేసి చూశారు. అంతే ఒక్కసారిగా వారి గుండెలు ఝల్లుమన్నాయి. వారి ముందర కదలాడే ప్రాణి ముసలి.. ఆ 11 అడుగుల మెుసలిని చూడగానే భయంతో పరుగులు తీశారు కులీలు. యజమానికి విషయం తెలుపడంతో అతడు వెంటనే అక్కడి SIకి సమాచారం ఇచ్చాడు. దాంతో ఎస్సై సాగర్ స్నేక్ సొసైటి అధ్యక్షుడు కృష్ణసాగర్ ను తీసుకుని మెుసలి ఉన్న స్థలానికి వచ్చాడు. అప్పటికే విషయం తెలియడంతో ఊర్లోని జనాలు అంతా తండోప తండాలుగా అక్కడికి వచ్చారు.
సాగర్ గ్రామస్థుల సహాయంతో తాళ్లతో ఆ మెుసలిని ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. పట్టుకున్న మెుసలిని వారు ఫారెస్ట్ అధికారులతో కలిసి దగ్గరలోని జూరాల ప్రాజెక్టులోకి వదిలి పెట్టారు. ఈ క్రమంలో వన్యప్రాణులు కనిపిస్తే వాటి ప్రాణాలు తీయకుండా మాలాంటి సొసైటీలకు సమాచారం ఇవ్వాలి అధికారులు సూచించారు. 11 అడుగుల భారీ మెుసలిని చూడడానికి స్థానిక జనాలు భారీగా వచ్చారు. మరి ఈ భారీ మెుసలి వరి పొలాల్లోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) September 2, 2022