ప్రజా గాయకుడు, తన పాటలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన వేద సాయిచంద్ హఠాన్మరణం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. కాగా నేడు హైదరాబాద్ లో దశదిన కర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిఎం కెసిఆర్ నివాళులర్పించారు.
తన పాటతో, ఆటతో ప్రజల్లో చైతన్యం నింపి తెలంగాణ ఉధ్యమంలో క్రియశీలక పాత్ర పోషించాడు గాయకుడు సాయిచంద్. తెలంగాణ రాష్ట్ర సాధనలో సాయిచంద్ తన వంతు కృషి చేశారు. సాయిచంద్ ప్రతిభను గుర్తించిన సిఎం కెసిఆర్ ఎంతగానో ప్రోత్సహించారు. సాయిచంద్ కు సముచిత గౌరవాన్ని ఇచ్చారు. స్వరాష్ట్రంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ గా నియమించారు. ఇటీవల గుండెపోటుకు గురైన సాయిచంద్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కాగా నేడు సాయిచంద్ దశదిన కర్మను హస్తినాపురంలోని జిఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిఎం కెసిఆర్ సాయిచంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ సాధనకై జరుగుతున్న ఉద్యమంలో తన పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేసి స్వరాష్ట్ర సాధనలో పాలుపంచుకున్నాడు గాయకుడు సాయిచంద్. ఉధ్యమ సారధి సిఎం కెసిఆర్ వెంట నడిచి ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన గాయకుడు సాయిచంద్ ఎప్పటికీ ప్రత్యేకమే. కాగా సాయిచంద్ తన ఫాం హౌస్ లో గుండెపోటుకు గురయ్యి మరణించిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు హైదరాబాద్ లో జిఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్ లో సాయిచంద్ దశదిన కర్మను జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్ హాజరయ్యారు. గాయకుడు సాయిచంద్ కు నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. సాయిచంద్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు, భార్య రజినిని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్ పర్సన్ గా నియమించారు.