కేంద్ర బడ్జెట్ సమావేశాల అనంతరం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలో వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై పెద్ద ఎత్తున మండి పడుతున్నారు. ఇక ప్రెస్ మీట్ లో ఎవరైనా ఆయనకు చిరాకు కలిగించే ప్రశ్నలు వేస్తే.. కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పటికే చాలా సార్లు చూశాం. తాజాగా మరోసారి సీఎం కేసీఆర్ రిపోర్టర్ పై ఫైర్ అయిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియో కేసీఆర్ సదరు రిపోర్టర్ ని ఉద్దేశించి.. ఆగమాగం ఉన్నావ్.. నిన్న మొన్న న్యూస్ చూడలేదా.. ఏం ప్రశ్నలు వేస్తావ్ అని వెటకారం చేస్తూ.. ఫైర్ అయ్యారు. ఆ వివరాలు..
కేంద్ర బడ్జెట్ ని ఖండిస్తూ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కేసీఆర్.. రాజ్యాంగాన్ని మార్చాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపాయి. ఈ క్రమంలో తాజాగా ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ కేసీఆర్ ను ప్రశ్నిస్తూ.. ‘‘రాజ్యాంగాన్ని మార్చాలని కొన్ని రోజుల క్రితం మీరు చేసిన ప్రకటనకు ఇప్పటికి కట్టుబడి ఉన్నారా’’ అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి : KCR కు బెంగాల్ సీఎం మమతా ఫోన్! మోదీ టార్గెట్ గా మాస్టర్ ప్లాన్!
ఈ ప్రశ్న కేసీఆర్ ను తీవ్ర అసహనానికి గురి చేసింది. ఈ క్రమంలో సదరు రిపోర్టర్ పై ఫైర్ అయ్యారు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెబుతూనే.. ‘‘ఆగమాగం ఉన్నావ్.. ఏ పేపర్ నీది.. ఎడ్డోనివా.. నేను చెప్పింది రాస్కో’’.. అంటూ ఎగతాళి చేశారు. ‘‘అసలు ఆరోజు సమావేశంలో నీవు ఉన్నావా’’ అంటూ వరుస ప్రశ్నలు కురిపిస్తూ.. అతడిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా చిరాకు పడటం ఏంటి.. ప్రజల నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చినా.. సంమయనం పాటిస్తూ.. సమాధానం చెప్పాలని కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.