ఈ మధ్య కాలంలో వాహనాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అందులోనూ ద్విచక్ర వాహనాలను అధిక సంఖ్యలో వినియోగిస్తున్నారు. వీటి విషయంలో ఎప్పటికప్పడు మార్పులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వచ్చాయి. హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. అయితే వీటిని వినియోగించే వారికి వచ్చే సందేహం..దారి మధ్యలో బ్యాటరీ డిస్ ఛార్జ్ అయితే పరిస్థితి ఏంటీ అని?. హైదరాబాద్ లోని ఎలక్ట్రిక్ వాహనదారులకు వారికి గుడ్ న్యూస్. హైదరాబాద్ నగరంలో ఆరు చోట్ల త్వరలోనే బ్యాటరీ స్వాపింగ్ సెంటర్లు ప్రారంభం కానున్నాయి.
ఈ మధ్యకాలం ప్రజలు పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల వైపే ఆసక్తి చూపుతున్నారు. ఆరోగ్య సమస్యలు, పెట్రోల్, డీజిల్ ధరలు దీనికి ప్రధాన కారణం కావచ్చు. దీంతో ఈ వాహనాల పరిశ్రమ ఇటీవల వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల కోనుగోలు చేసేవారికి ఎదురయ్యే ప్రధాన సందేహం.. మార్గం మధ్యలో బ్యాటరీ అయిపోతే పరిస్థితి ఏంటి? పెట్రోల్ బంకుల తరహాలో బ్యాటరీలు మార్చుకునే అవకాశం ఉంటే బాగుంటుందని చాలా మంది భావిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ వాహనాల వాడకంలో ఎదురయ్యే ఇబ్బందులను తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (TSREDCO) గుర్తించింది. ఈ సంస్థ హైదరాబాద్ నగరంలో బ్యాటరీ స్వాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సన్నహాలు చేస్తుంది
.
అందులో భాగంగా తొలివిడతగా కనీసం ఆరు బ్యాటరీ స్వాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. నగరానికి నాలుగు దిక్కులా నాలుగు బ్యాటరీ స్వాపింగ్ సెంటర్లను, సిటీ మధ్యలో మరో రెండు సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు TSREDCO అధికారులు తెలిపారు. ఈ సెంటర్లలో రూ.40 వేల నుంచి రూ.50 వేల విలువైన స్వాపింగ్ బ్యాటరీలను అందుబాటులో ఉంచనున్నారు. నిజంగా ఇది ఎలక్ట్రిక్ వాహనదారులు శుభవార్తే. మరి.. ఈవిషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.