చికోటి ప్రవీణ్ గురించి తెలియని వారుండరు. ప్రస్తుతం క్యాసినో, మనీల్యాండరింగ్ కేసుల్లో ఈడీ విచారణ ఎదుర్కుంటున్నారు. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని, తాను ఏ తప్పూ చేయలేదని, ఈడీ విచారణకు తానెప్పుడూ సిద్ధమేనని అన్నారు. క్యాసినో బిజినెస్ చేస్తే తప్పేమి కాదన్న ఈయనలో మరో కోణం కూడా ఉంది. తనలో హార్డ్ క్యారెక్టరే కాదని, సాఫ్ట్ క్యారెక్టర్ కూడా ఉందని అన్నారు. జంతువుల పట్ల అమితమైన ప్రేమ, ఆధ్యాత్మిక చింతన వంటి మంచి అలవాట్లు ఉన్నాయని అన్నారు. తనకి దైవత్వం ఎక్కువే అని, హిందువుగా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యమని, ధర్మం కోసం, ధర్మాన్ని కాపాడేందుకు కొంత సమయం కేటాయించాలని అన్నారు. దైవ కార్యాలు చేయడంలో తానెప్పుడూ ముందుంటానని, గోసేవ చేస్తానని అన్నారు. గోవుని జాతీయ జంతువుగా గుర్తించాలని 20 వేల కిలోమీటర్ల మేర బాలకృష్ణ గురు స్వామి చేపట్టిన పాదయాత్రకి తాను అడ్వైజర్గా ఉన్నానని అన్నారు.
ఇక తనకి జంతు ప్రేమ ఎక్కువేనని, వాటికి ఏమైనా అయితే తట్టుకోలేనని అన్నారు. ఒకరోజు తాను రేంజ్ రోవర్ కారులో ఫామ్ హౌజ్ నుండి ఇంటికి వెళ్ళే దారిలో ఒక సంఘటన జరిగిందని అన్నారు. “అప్పుడు ఒక ముస్లిం వ్యక్తి అప్పుడే పుట్టిన లేగ దూడలని.. ఒకటి లేదా రెండు రోజులవుతాయ్ పుట్టి. వాటిలో ఒకదాన్ని స్కూటీ వెనుక కట్టి, మరొక దాన్ని స్కూటీ ముందు కాలి దగ్గర ఉంచాడు. ఆ దూడ మీద కాలు పెట్టి బండి నడుపుతున్నాడు. అయితే ఆ సమయంలో ఆ దూడ మూతి రోడ్డుకి తగులుతుంది. అది చూసి తట్టుకోలేకపోయాను. వెంటనే ఆ వ్యక్తిని కొట్టి ఆ ఆవు దూడని రేంజ్ రోవర్ కారులో ఎక్కించి ఫామ్ హౌజ్కి తీసుకెళ్ళానని అన్నారు. జంతువులను పెంచుకోవడం తనకి ఎంతో ఇష్టమని, తనలో అనేక మంచి గుణాలు ఉన్నాయని అన్నారు. చికోటి ప్రవీణ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింది వీడియో చూడండి.