తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వేర్వురు రంగాలకు చెందని ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. తాజాగా మరో ప్రముఖుడు కన్నుమూశారు. ఆ వివరాలు.. సోషలిస్టు నేత, రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన పరిపాటి జనార్ధన్ రెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. అతనికి 87 సంవత్సరాలు. జనార్ధన్ రెడ్డికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
పి.జనార్ధన్ రెడ్డి కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో.. 1935 జనవరి 1న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి MA పూర్తి చేసిన తరువాత, ఆయన 24 సంవత్సరాల వయస్సులో జమ్మికుంట నుండి సమితి అధ్యక్ష పదవికి విజయవంతంగా పోటీ చేసాడు. ఆ తర్వాత ఉమ్మడి హుజూరాబాద్ తాలూకాలో మరో రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు.ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినందుకు వ్యతిరేకంగా జై ప్రకాష్ నారాయణ్ నేతృత్వంలోని లోక్ సంఘర్ష్ సమితిలో చేరాడు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేయడంతో మిసా యాక్ట్ కింద అరెస్ట్ అయ్యి.. ముషీరాబాద్ జైలులో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. జనార్ధన్ రెడ్డి 1977లో హన్మకొండ నియోజకవర్గం నుంచి జనతాపార్టీ తరఫున మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుపై పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు.
జనార్ధన్ రెడ్డి 1964-65లో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆదర్శ డిగ్రీ కళాశాలను స్థాపించారు. అనంతరం దాన్ని ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖకు అప్పగించారు. అలానే కుష్టు వ్యాధిగ్రస్తుల పిల్లల కోసం జమ్మికుంటలో ఆశ్రమ పాతశాలను స్థాపించారు. 1974లో గ్రామ నవ నిర్మాణ సమితి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య మరియు గ్రామీణాభివృద్ధి రంగాలలో తెలంగాణ గ్రామీణ ప్రజలకు సేవలందించారు.
ఆయన 1992లో వ్యవసాయ మంత్రిత్వ శాఖచే స్పాన్సర్ చేయబడి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) సంస్థాగత ప్రాజెక్ట్ అయిన కృషి విజ్ఞాన కేంద్రం (KVK)ని న కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో స్థాపించాడు. జనార్ధన్ రెడ్డి మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.