పవర్ హిట్టింగ్ చేస్తూ నిలకడగా పరుగులు రాబట్టడం అప్పట్లో యువరాజ్ సింగ్ కే చెల్లింది. వన్డేల్లో ఫోర్లు తప్ప సిక్సులు కొట్టడానికి భయపడే ఆ రోజుల్లో యువీ భయపడకుండా సిక్సులు కొడుతూ ఒక కొత్త ట్రెండ్ సృష్టించాడు. ఇక 2007 టీ 20 లో ఆస్ట్రేలియా మీద ఆడిన సెమీఫైనల్ మ్యాచ్ లో యువీ సునామీ ఇన్నింగ్స్ ఆడేశాడు. యువీ ఇన్నింగ్స్ నమ్మలేక రిఫరీ చేసిన ఒక ఆ పని అప్పట్లో వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా-ఇండియా మధ్య 2007 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్. నిలకడగా ఆడటం తప్ప హిట్టింగ్ చేసే రోజులు కాదు. అసలే మొదటి టీ 20 వరల్డ్ కప్. ప్రత్యర్థిగా ప్రపంచ క్రికెట్ ని వణికిస్తున్న ఆస్ట్రేలియా. వీరేంద్ర సెహ్వాగ్ సైతం బ్యాట్ ఝళిపించడానికి తడబడ్డాడు. మరో వైపు జట్టు స్కోర్ చూస్తే 8 ఓవర్లో 41 పరుగులు మాత్రమే. ఈ దశలో ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి చిత్తుగా ఓడిపోవడం గ్యారంటీ అనుకున్నారంతా. కానీ యువరాజ్ సింగ్ ఆసీస్ బౌలర్ల భారతం పట్టాడు. బౌండరీలతో డర్బన్ స్టేడియంని హోరెత్తించాడు. అసాధారణ ఇన్నింగ్స్ తో టీమిండియాని ఒంటి చేత్తో ఫైనల్ కి తీసుకెళ్లాడు. ఇక ఈ మ్యాచ్ లో యువి చేసిన బ్యాటింగ్ చేసినంత సేపు మ్యాచ్ రిఫరీకి ఏమి అర్ధం కాలేదు. యువీ ఇన్నింగ్స్ నమ్మలేక రిఫరీ చేసిన ఒక ఆ పని అప్పట్లో వైరల్ గా మారింది.
పవర్ హిట్టింగ్ చేస్తూ నిలకడగా పరుగులు రాబట్టడం అప్పట్లో యువరాజ్ సింగ్ కే చెల్లింది. వన్డేల్లో ఫోర్లు తప్ప సిక్సులు కొట్టడానికి భయపడే ఆ రోజుల్లో యువీ భయపడకుండా సిక్సులు కొడుతూ ఒక కొత్త ట్రెండ్ సృష్టించాడు. ఇక టీ 20 లు వచ్చిన తర్వాత ఈ లెఫ్ట్ హ్యాండర్ విధ్వంసం ఆకాశాన్ని దాటింది. అందులో ఒక బెస్ట్ ఇన్నింగ్స్ 2007 వరల్డ్ కప్ సెమి ఫైనల్ లో ఆస్ట్రేలియా మీద ఆడిన ఇన్నింగ్స్. ఆ మ్యాచులో కేవలం 30 బంతుల్లోనే 70 పరుగులు చేసాడు. దుర్బేధ్యంగా ఉన్నటువంటి ఆసీస్ బౌలర్లని అలవోకగా ఆడేశాడు. యువీ ఇనింగ్స్ లో 5 ఫోర్లు, 5 భారీ సిక్సర్లు ఉండడం విశేషం. ఇక ఇన్నింగ్స్ తర్వాత మ్యాచ్ రిఫరీ యువీ బ్యాటింగ్ ని నమ్మలేక బ్యాట్ చెక్ చేయడం గమనార్హం. యువరాజ్ ఆడుతూ ఉంటే చాలా సింపుల్ గా బౌండరీ వెళ్ళేది. ఈ కారణంగానే తన బ్యాట్ చెక్ చేసాడని తాజాగా యువరాజ్ స్వయంగా వెల్లడించాడు.
తొలి 41/2 వికెట్లు కోల్పోయిన అనంతరం క్రీజ్ లోకి వచ్చి యువరాజ్.. రాబిన్ ఉతప్పతో కలిసి స్కోర్ బోర్డు ని పరుగులు పెట్టించాడు. ఉతప్ప ఔటైన కెప్టెన్ ధోని సహకారంతో జట్టుకి 188 పరుగుల భారీ స్కోర్ ఆసీస్ ముందు ఉంచాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. బౌలర్లందరూ సమిష్టిగా రాణించడంతో 173 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్ గెలవడంలో యువీదే కీ రోల్. ప్రస్తుతం టీ 20 లీగ్ లు ఎక్కువైన తరుణంలో 30 బంతుల్లో 70 పరుగులు చేయడం అంటే పెద్దగా ఆశ్చర్యపడకపోయినా అప్పట్లో యువీ విధ్వంసం ఒక సంచలనం. ఒక్క మ్యాచ్ రిఫరీనే కాదు, యువరాజ్ బ్యాటింగ్ కి ఆసీస్ బౌలర్లు అలా చూస్తూ ఉండిపోయారు. మొత్తానికి నమ్మడానికి కూడా వీలు లేని యువీ బ్యాటింగ్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.