ఆస్ట్రేలియాతో.. భారత్ ఆడబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం అభిమానులతో పాటుగా క్రికెట్ నిపుణులు, దిగ్గజాలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జూన్ 7 న లండన్ లోని ఒవెల్ మైదానం ఈ మ్యాచ్ కి ఆతిధ్యమివ్వనుంది. ఇదిలా ఉండగా.. తాజా సమాచారం ప్రకారం ఈ మ్యాచ్ కి వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. ఒకవేళ అలా జరిగితే ఈ మ్యాచులో విన్నర్ ఎవరనే సందేహం నెలకొంది.
2021 లో తొలిసారి డబ్ల్యూటీసి ఫైనల్ జరిగింది. ఈ టెస్ట్ మ్యాచులో భారత్.. న్యూజిలాండ్ తో తలపడగా కివీస్ విజయం సాధించి తొలిసారి డబ్ల్యూటీసి ఫైనల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే మరోసారి అత్యున్నతమైన ఆటతీరుని కనబర్చిన టీమిండియా వరుసగా రెండో సారి కూడా ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కి అర్హత సాధించింది. కాకపోతే ఈ సారి ప్రత్యర్థిగా ఆస్ట్రేలియా తలపడబోతుంది. చివరిసారిగా 2013 లో ధోని నాయకత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినా భారత్ జట్టు ఆ తర్వాత చాలా సార్లు నాకౌట్ మ్యాచులు ఆడినా నిరాశే ఎదురైంది. డబ్ల్యూటీసీ ఫైనల్ రూపంలో మరోసారి ఐసీసీ టైటిల్ గెలుచుకునే అవకాశం వచ్చింది. దీంతో అభిమానులు టీమిండియా మీద భారీగానే ఆశలు పెట్టుకున్నారు.
ఐపీఎల్ సందడి ముగిసిన తర్వాత ఇప్పుడు క్రికెట్ లవర్స్ చూపు డబ్ల్యూటీసి ఫైనల్ మీద పడింది. ఆస్ట్రేలియాతో.. భారత్ ఆడబోయే ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులతో పాటుగా క్రికెట్ నిపుణులు, దిగ్గజాలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జూన్ 7 న లండన్ లోని ఒవెల్ మైదానం ఈ మ్యాచ్ కి ఆతిధ్యమివ్వనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేసారు. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకి స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారంకానుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మ్యాచ్ కి వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. ఒకవేళ అలా జరిగితే ఈ మ్యాచులో విన్నర్ ఎవరనే సందేహం నెలకొంది.
ఓవల్ లో పిచ్ సాధారణంగా బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది. అయితే మ్యాచ్ జరిగేకొద్దీ పిచ్ స్పిన్ కి అనుకూలించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వాతావరణ విషయంలో మొదటి నాలుగు రోజులకి ఏ మ్యాచ్ కి ఎలాంటి వర్ష సూచనలు లేవని తెలుస్తుంది. కానీ చివరి రోజు మాత్రం 56 శాతం వర్షం కురిసే అవకాశం ఉందట. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ కి రిజర్వు డే కూడ ఉండడం కాస్త ఊరట కలిగిస్తుంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ డ్రాగా ముగిసినా.. రద్దయినా భారత్, అస్ట్రేలియా జట్లను సంయక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఐపీఎల్ ఫైనల్ కి వర్షం పడి మ్యాచ్ రద్దయితే గ్రూప్ దశలో టేబుల్ టాపర్ గా ఉన్న జట్టుని విజేతగా ప్రకటిస్తారు. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆ అవకాశం లేదు. మరి ఈ మ్యాచులో ఫలితం వస్తుందా ? లేకపోతే డ్రా అవుతుందో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలపండి.