జింబాబ్వే చేతిలో ఓటమి పాకిస్థాన్ టీమ్ను ఒక రేంజ్లో వేధిస్తోంది. తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో ఓటమికి తోడు సీనియర్ పసికూన జింబాబ్వే చేతిలో ఓటమి పాక్కు ఘోర అవమానం లాంటింది. పైగా టోర్నీ ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరేట్స్లో ఒకటిగా ఉన్న పాక్ టీమ్.. రెండు వరుస ఓటములతో సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో పాకిస్థాన్ టీమ్ సెమీస్ చేరాలంటే బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, నెథర్లాండ్స్తో మిగిలిన మూడు మ్యాచ్లను కచ్చితంగా గెలిచి తీరాలి. అలాగే.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాలి. ఇన్ని చిక్కుల మధ్య పాకిస్థాన్ సెమీస్చేరితే అది అద్భుతమనే చెప్పాలి. టీమిండియాపై ఓటమి కంటే కూడా.. జింబాబ్వే చేతిలో కేవలం 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోడివడం పాక్ టీమ్ను మానసికంగా కుంగదీసింది.
అలాగే.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు సైతం పాకిస్థాన్ టీమ్ ప్రదర్శన తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా షోయబ్ అక్తర్ పాక్ టీమ్ ఇంటికి వచ్చేస్తుందని తనకు ముందే తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశాడు. జట్టులోని ఆటగాళ్లు యావరేజ్ ఆటగాళ్లని అందుకే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని మండిపడ్డాడు. అలాగే బాబర్ అజమ్ కెప్టెన్సీ అయితే చెత్త కెప్టెన్సీ అని, అతను స్వార్థం కోసం ఆడుతున్నాడని అన్నాడు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, బాబర్ వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చి.. ఓపెనింగ్ స్థానాన్ని ఫకర్ జమాన్కు ఇవ్వాలని అక్తర్ సూచించాడు.
ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ టీమ్ పాక్ క్రికెట్ ఫ్యాన్స్ పీకలదాక కోపంతో రగిలిపోతున్నారు. కొంతమంది పాకిస్థాన్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. జింబాబ్వేపై ఓటమితో తీవ్ర మనస్థాపానికి గురైన పాకిస్థాన్ క్రికెట్ అభిమాని ఒకతను.. పాకిస్థాన్ టీమ్ను, కెప్టెన్ బాబర్ అజమ్, మొహమ్మద్ రిజ్వాన్లను బండబూతులు తిడుతూ ఒక వీడియో పోస్టు చేశాడు. జింబాబ్వేతో మ్యాచ్లో టుచుక్.. టుచుక్ అంటూ జిడ్డూ బ్యాటింగ్ చేశారని, రెండు ఓవర్లలో మూడు పరుగులు ఏంటి? మీ కొంచెం కూడా సిగ్గులేదా? ఫేస్బుక్, ట్విట్టర్లో ఎక్కడ చూసిన హీరోల్లా ఫోజులు కొటే మీరు.. ఆటలో మాత్రం చెత్త అని అన్నాడు. అలాగే.. అక్కడ ఉండి ఆడి అన్ని టీమ్స్కు రెండు రెండు పాయింట్టు ఇచ్చి రండి అంటూ ఆ అభిమాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
🤣🤣🤣🤣🤣 pic.twitter.com/jQ5C8muJCI
— Gabbbar (@GabbbarSingh) October 27, 2022