మన దేశంలో క్రికెట్ బాగా ఆడేవాళ్లు చాలామంది ఉంటారు. అలా అని అందరికీ అవకాశాలు అంటే కొన్నిసార్లు కుదరకపోవచ్చు. ఈ మధ్య కాలంలో అలా దేశవాళీ టోర్నీ రంజీల్లో పరుగుల వరద పారిస్తున్న ముంబయి క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ని సెలెక్టర్లు పట్టించుకోకపోవడం సోషల్ మీడియాలో తెగ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరస సెంచరీలతో అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్ ని ఆస్ట్రేలియాతో సిరీస్ కు ఎంపిక చేయాల్సిందని గవాస్కర్ లాంటి దిగ్గజ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే సెలెకర్లు మాత్రం పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో అదరగొడుతున్న సూర్యకుమార్ ని .. ఈ సిరీస్ కోసం ఎంపిక చేశారు. ఇప్పుడు ఇదే విషయమై మాట్లాడిన సర్ఫరాజ్.. సూర్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అండర్-19 వరల్డ్ కప్ తో వెలుగులోకి వచ్చిన కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్. ఆ తర్వాత ఐపీఎల్ లోనూ బెంగళూరు, పంజాబ్ జట్లకు ఆడాడు కానీ పెద్దగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్సులు అయితే లేవు. ఇదంతా పక్కనబెడితే.. దేశవాళీలో మాత్రం తాజాగా అదిరిపోయే బ్యాటింగ్ చేస్తున్నాడు. గత రంజీ సీజన్ లో 982 పరుగులు చేసిన సర్ఫరాజ్… ప్రస్తుతం సీజన్ లో జరిగిన ఆరు మ్యాచుల్లో 9 ఇన్నింగ్స్ ల్లో 556 పరుగులు చేశాడు. ఓవరాల్ గా చూసుకుంటే గత 23 ఇన్నింగ్స్ ల్లో ఏకంగా 10 సెంచరీలు చేయడం విశేషం. దీంతో తనని ఆస్ట్రేలియాతో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఎంపిక చేసేస్తారని సర్ఫరాజ్ భావించాడు. అతడి బదులు సూర్యని ఎంపిక చేయడంతో కాస్త నిరాశ చెందాడు. గానీ అదే టైంలో ఓ రిపోర్టర్ తో మాట్లాడుతూ.. సూర్యకుమార్ కెరీర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘సూర్య.. టెస్టు జట్టులోకి రావడం, టీ20ల్లో తన ప్లేస్ సుస్థిరం చేసుకోవడం నాకు ఇన్సిపిరేషన్ లాంటిదే. ఎందుకంటే అతడు నా బెస్ట్ ఫ్రెండ్. ముంబయికి ఆడినప్పుడు మేం చాలా టైం స్పెండ్ చేసేవాళ్లం. నేను, సూర్య నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. సూర్య కూడా జాతీయ జట్టులోకి రావడానికి చాలా టైం వెయిట్ చేశాడు. ఇబ్బందులు కూడా పడ్డాడు. రంజీల్లో తన అనుభవాన్ని టీ20ల్లో చూపెడుతున్నాడు. ఆ విధంగా టెస్టుల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.’ అని సర్ఫరాజ్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా త్వరలో మన దేశానికి రానున్న ఆస్ట్రేలియా జట్టు.. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 22 మధ్య నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. మరి సూర్య గురించి సర్ఫరాజ్ చెప్పిన దానిపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.