ప్రపంచవ్యాప్తంగా నేడు క్రిస్మస్ పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రజలకు, అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కూడా అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. ఏ ఏడాదైనా క్రిస్మస్ పండుగ ఒకే అనుభూతిని కలిగిస్తుందని ట్వీట్ చేశారు. అంతేకాకుండా తాను గతంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఫోటోలను సచిన్.. తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.<
Different years, same feeling!
Merry Christmas everyone.🎄🎅 pic.twitter.com/9OjFy003CX— Sachin Tendulkar (@sachin_rt) December 25, 2021
/p>
ఇందులోని ఓ ఫోటోలో సచిన్ శాంటా క్లాస్ గెటప్లో ఉన్నారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2018లో చిన్న పిల్లలతో కలిసి క్రిస్మస్ తాతయ్య గెటప్లో చేసుకున్న సంబరాలను సచిన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అలాగో మరో ఫొటోలో క్రిస్మస్ తాతయ్యతో సచిన్ ఉన్నాడు. ఈ ఫొటో 2019ది. అలాగే టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతోపాటు మాజీ క్రికెటర్లు వసీం జాఫర్, వీవీఎస్ లక్ష్మణ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ కూడా ట్విట్టర్ వేదికగా క్రిస్మస్ విషెస్ తెలిపారు.