ప్రపంచవ్యాప్తంగా నేడు క్రిస్మస్ పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రజలకు, అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కూడా అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. ఏ ఏడాదైనా క్రిస్మస్ పండుగ ఒకే అనుభూతిని కలిగిస్తుందని ట్వీట్ చేశారు. అంతేకాకుండా తాను గతంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఫోటోలను సచిన్.. తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.< […]