‘చినిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో’. మంచి పుస్తకం స్నేహితుడితో సమానమని కందుకూరి వీరేశలింగం పంతులు చెప్పిన మాటలు అందరకి గుర్తుండే ఉంటాయి. ఓ మంచి పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. పుస్తకాన్ని చదవడం కనుక మనం అస్వాదించగలిగితే.. అమ్మలా లాలిస్తుంది.. నాన్నలా ఆదరిస్తుంది. గురువులా హితబోధ చేస్తుంది.. అలసిన మనసులను సేద తీర్చుతుంది.. అందుకే పుస్తకం అనితరమైన ఆయుధంగా, మంచి నేస్తంగా అన్ని తరాలవారినీ అలరిస్తోంది. ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్బంగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పుస్తక పఠనంలో మునిగిపోయారు. అసలు సచిన్ చదువుతన్న పుస్తకమేంటి?. ఆ పుస్తకాన్ని రాసిన రచయిత ఎవరో తెలుసుకోవాలని ఉందా?. అయితే ఇది చదివేయండి.
ఏప్రిల్ 23 ‘వరల్డ్ బుక్ డే’ సందర్బంగా సచిన్.. వాళ్ల నాన్నగారు రమేష్ టెండూల్కర్ రచించిన ‘సాహిత్య’ అను పుస్తకాన్ని చదువుతూ కనిపించారు. ‘మిస్ యు బాబా’ అనే కాప్షన్ జోడించి అందుకు సంబంధించిన పోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు సచిన్. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. వీటిపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘పుస్తకాన్ని మించిన బహుమతి లేదు. ఇది మనకు ఏదో ఒక విధంగా స్ఫూర్తినిస్తుంది, పుస్తకాన్ని చదివినప్పుడల్లా మంచి విషయాన్నే నేర్పుతుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సచిన్ కు వాళ్ల నాన్న అంటే ఇష్టం. టీమిండియా 1999 వరల్డ్ కప్ సందర్బంగా ఇంగ్లాండ్ లో పర్యటించినపుడు.. సచిన్ తండ్రి హార్ట్ అటాక్ తో చనిపోయారు.
ఇది కూడా చదవండి: సచిన్ కనిపించగానే దద్దరిల్లిపోయిన స్టేడియం!
సచిన్కు సంగీతం అంటే విపరీతమైన పిచ్చి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్, మరాఠీ పాటలంటే సచిన్ కు చాలా ఇష్టమట. సచిన్ గతంలో సోనూ నిగమ్తో కలిసి ఓ పాటను కూడా పాడారు. ప్రస్తుతానికి.. క్రికెట్ గాడ్ ఐపీఎల్ 2022 సీజన్ లో ముంబై ఇండియన్స్కు మెంటార్గా వ్యవహరిస్తున్నారు.