వెస్టిండీస్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో గెలిచిన టీమిండియా మరింత ఉత్సాహంతో రేపు రెండో టెస్టు ఆడేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో తుది జట్టులో మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. అదే జరిగితే బెంచ్ మీద కూర్చున్న గైక్వాడ్ టెస్టుల్లో అరంగ్రేటం ఖాయంగా కనబడుతుంది.
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో రాణించి బలహీనంగా ఉన్న విండీస్ ని చిత్తు చేసింది. జైస్వాల్ తొలి టెస్టులోనే పరుగుల వరద పారించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సెంచరీతో సత్తా చాటాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా హాఫ్ సెంచరీతో మంచి టచ్ లో కనిపించాడు. బౌలర్లలో అశ్విన్ విండీస్ పతనాన్ని శాసిస్తే.. మిగిలిన బౌలర్లందరూ తమ వంతు పాత్ర పోషించారు. ఇక తొలి టెస్టులో గెలిచిన టీమిండియాకు మరింత ఉత్సాహంతో రేపు రెండో టెస్టు ఆడేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో తుది జట్టులో మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. అదే జరిగితే బెంచ్ మీద కూర్చున్న గైక్వాడ్ టెస్టుల్లో అరంగ్రేటం ఖాయంగా కనబడుతుంది. అయితే గైక్వాడ్ ఎవరి ప్లేస్ లో వస్తాడో ఇప్పుడు చూద్దాం.
రుతు రాజ్ గైక్వాడ్ అందరికీ సుపరిచితమే. గత మూడేళ్ళుగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచులు, ఐపీఎల్ రాణిస్తూ అందరి దృష్టిలో పడ్డాడు. ఈ నేపథ్యంలోనే విండీస్ తో టెస్టు సిరీస్ కి గైక్వాడ్ ని సెలెక్ట్ చేశారు. పుజారా మీద వేటు వేసి ఈ యంగ్ ప్లేయర్ ని స్క్వాడ్ లో చేర్చిన సంగతి తెలిసిందే. అయితే మొదటి టెస్టు తుది జట్టులో ఆడే అవకాశం అయితే రాలేదు. అద్భుతమైన టెక్నీక్, టైమింగ్ కలగలసిన గైక్వాడ్ ఆట చూడ చక్కగా ఉంటుంది. ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు ఇండియా-ఏ జట్టు కన్నా బలహీనంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గైక్వాడ్ కి ప్లేస్ ఇవ్వనున్నట్లు సమాచారం. అదే జరిగితే రోహిత్, రహానే, కోహ్లీ ఒకరు బెంచ్ మీద కూర్చోవాల్సి ఉంటుంది. ఇప్పుడిప్పుడే భవిష్యత్తు స్టార్లు గా ఎదుగుతున్న జైస్వాల్, గిల్ స్థానానికి ఎలాంటి ఇబ్బంది లేకపోవచ్చు. ఒకవేళ గైక్వాడ్ తుది జట్టులోకి వస్తే ఇప్పుడు ఈ సీనియర్లలో ఎవరిని పక్కన పెడతారనేది ఆసక్తి కరంగా మారింది.
రోహిత్ శర్మ కెప్టెన్ కావడంతో ఖచ్చితంగా జట్టులో కొనసాగుతారు. ఇక వైస్ కెప్టెన్ గ రహానేని కూడా తప్పించలేని పరిస్థితి. ఇక కోహ్లీకి రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే కనబడడం లేదు. ఈ నేపథ్యంలో ఫాస్ట్ బౌలర్లలో ఒకరిని పక్కన కుర్చోపెట్టే ఛాన్స్ ఉంది. విండీస్ పిచ్ మీద ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు అవసరం లేదని భావిస్తే ఒకరిపై వేటు వేసి గైక్వాడ్ కి ఛాన్స్ ఇవ్వొచ్చు. పైగా తొలి టెస్టులో స్పిన్నర్లు అశ్విన్, జడేజా విండీస్ ని తిప్పేసిన సంగతి తెలిసిందే. ఇక జడేజాకు రెస్ట్ ఇచ్చి అక్షర్ పటేల్ ని తుది జట్టులోకి తీసుకు రావొచ్చు. పేసర్ ముఖేష్ కుమార్ కి తుది జట్టులో చేర్చాలని భావిస్తే సిరాజ్ కి ఈ టెస్టులో రెస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి రెండో టెస్టు తుది జట్టు ఎలా ఉంటుందో ఆసక్తికరంగా మారింది. మరి ఒకవేళ రుతురాజ్ కి అవకాశం ఇస్తే ఎవరి ప్లేస్ లో వచ్చే అవకాశం కనిపిస్తుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.