విండీస్ పై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టినా ఒక ప్రశ్న మాత్రం అభిమానుల్లో అలాగే ఉండిపోయింది. అదేంటో కాదు బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు. అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసాడు.
వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ లో కాస్త తడబడినా బౌలింగ్ మాత్రం విండీస్ జట్టుకి చుక్కలు చూపించింది. ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగడంతో విండీస్ జట్టు 23 ఓవర్లలో కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ షై హోప్ 43 పరుగులు చేసి పర్వాలేదనిపించగా మిగిలిన వారందరూ విఫలమయ్యారు. కుల్దీప్ యాదవ్ 4, జడేజా 3 వికెట్లు తీసుకున్నారు. పేసర్లు ముఖేష్ కుమార్, శార్దుల్ ఠాకూర్, హార్దిక్ పాండ్యకి తలో ఒక వికెట్ దక్కింది. ఇక లక్ష్య ఛేదనలో స్వల్ప స్కోర్ ని ఛేజ్ చేసేందుకు టీమిండియా కాస్త శ్రమించాల్సిన పరిస్థితి. అయితే ఇంతవరకు బాగానే ఈ మ్యాచులో 5 వికెట్లు పడినప్పటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కే రాలేదు. ఇక ఓపెనర్ గా దిగాల్సిన కెప్టెన్ రోహిత్ శర్మ ఏడో స్థానంలో బ్యాటింగ్ కి దిగడం ఆశ్చర్యంగా అనిపించింది. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసాడు.
విండీస్ పై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టినా ఒక ప్రశ్న మాత్రం అభిమానుల్లో అలాగే ఉండిపోయింది. అదేంటో కాదు బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు. సాధారణంగా ఓపెనర్ గా రోహిత్, వన్ డౌన్ లో కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటారు. కానీ నిన్న అనూహ్యంగా బౌలింగ్ ఆర్డర్ శార్దూల ఠాకూర్ రావడం ఆశ్చర్యం కలిగించింది. ఈ బ్యాటింగ్ ఆర్డర్ కారణంగా 115 పరుగుల లక్ష్యాన్ని కూడా 5 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. ఇషాన్ కిషన్(52) మాత్రం హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా మిగిలిన వారు విఫలమయ్యారు. ఈ విషయంపై స్పందించిన రోహిత్ శర్మ వరల్డ్ కప్ ఉండడంతో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ మార్పులు చేశామని వివరణ ఇచ్చాడు .
ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ ” లక్ష్యం తక్కువగా ఉండడంతో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని భావించాం. కానీ స్వల్ప లక్ష్య ఛేదనలో కూడా 5 వికెట్లు కోల్పోతామని ఊహించలేదు. స్వదేశంలో వరల్డ్ ఉన్న నేపథ్యంలో వీలైనప్పుడల్లా ఇలా కుర్రాళ్ళకి అవకాశం ఇచ్చేనందుకు ప్రయత్నిస్తాం. ఈ మ్యాచులో ఏడో స్థానంలో బ్యాటింగ్ కి రావడం నా డెబ్యూ మ్యాచ్ ని గుర్తు చేసింది. అని చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ గురించి మాట్లాడుతూ “ముందుగా బౌలింగ్ చేసి లక్ష్యాన్ని చేధించాలనుకున్నాం. కానీ పిచ్ ఇలా కఠినంగా తయారవుతుందని ఊహించలేదు. బౌలర్లకు ఊహించని రీతిలో పిచ్ అనుకూలించకపోవడంతో పరుగులు చేయడం బాగా కష్టమైపోయింది”.అని తెలియజేశాడు. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై అభిమానులు ఒకొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. రోహిత్, కోహ్లీ తమ కిట్ మర్చిపోయారని కొందరు అంటుంటే.. కోహ్లీ, రోహిత్ ఉన్నారనే కారణంతో ఇండియన్ బ్యాటర్లు దైర్యంగా బ్యాటింగ్ చేశారని చెప్పుకొచ్చాడు. మొత్తానికి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.