భారత్-వెస్టిండీస్ మధ్య మూడు టీ20ల సిరీస్లో భాగంగా బుధవారం రాత్రి కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత ఫీల్డిండ్ ఎంచుకున్న టీమిండియా విండీస్ను ఒక మోస్తారు స్కోర్కే కట్టడి చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విండీస్ 157 పరుగులు చేసింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ నికోలస్ పూరన్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 61 పరుగులతో అదరగొట్టాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రోహిత్ 40 పరుగులతో రాణించాడు.
కాగా వెస్టిండీస్ బ్యాటింగ్ సమయంలో నికోలస్ పూరన్ గాల్లోకి లేపాడు. దాన్ని టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ సునాయసంగా అందుకున్నాడు. కానీ బౌండరీ లైన్ను గమనించకుండా వెనకకు అడుగులేస్తూ.. బౌండరీ లైన్ను తొక్కాడు. దీంతో సిక్స్పోని బాల్ను పట్టుకోని మరీ సిక్స్ ఇచ్చినట్లు అయింది. బిష్ణోయ్ క్యాచ్ అందుకున్న వీడియోను సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హ్యాపీడేస్ సినిమాలో కృష్ణుడు చేసిన ఫీల్డింగ్ను రియల్ మ్యాచ్లో బిష్ణోయ్ రిపీట్ చేశాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి రవి బిష్ణోయ్ క్యాచ్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Bleh (@rishabh2209420) February 16, 2022