దిగ్గజ కెప్టెన్ ధోనీ చేసిన సహాయం చాలా గొప్పదని టీమిండియా మాజీ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. దానివల్ల అది కాస్త సులభమైపోయిందని కూడా అన్నాడు. ఇంతకీ ధోనీ ఏం హెల్ప్ చేశాడు? ఇంతకీ ఏం జరిగింది?
మహేంద్ర సింగ్ ధోనీ.. కెప్టెన్ గా మాస్టర్, ఫినిషర్ గా సూపర్, ట్రోఫీలు గెలవడంలో అయితే ఇతడిని కొట్టేవారు లేరు. ఎందుకంటే 2004లో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ధోనీ.. కేవలం మూడేళ్లలోనే కెప్టెన్ అయిపోయాడు. కెరీర్ ప్రారంభంలోనే టీ20 ప్రపంచకప్ గెలిచి తన స్టామినా ఏంటో చూపించాడు. ఆ తర్వాత వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ విజయాల్ని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్ గా అప్పట్లో రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు. ఇది మాత్రమే కాదు.. టెస్టుల్లోనూ టీమిండియా నం.1 ర్యాంక్ ని అందుకోవడంలోనూ ధోనీ కీలకపాత్ర పోషించాడు. అలాంటి ధోనీ.. చాలా సహాయం చేశాడని భారత మాజీ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ విషయం వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ధోనీ పేరు చెప్పగానే అందరికీ ఐసీసీ మూడు ట్రోఫీలు గుర్తొస్తాయి. అదే టైంలో అద్భుతమైన ఫినిషర్, వికెటర్ కీపర్ అనేది కూడా జ్ఞాపకం వస్తాయి. అలానే డీఆర్ఎస్, వికెట్ల వెనక స్పిన్నర్లకు సలహాలు, సూచనలిచ్చే విషయంలోనూ ధోనీది ఎప్పుడూ టాప్ క్లాస్. అతడి కెప్టెన్సీలో ఆడిన చాలామంది బౌలర్లు ఈ విషయం ఎప్పటికప్పుడూ చెబుతూనే ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ధోనీ కెప్టెన్ గా ఉన్న టైంలో స్పిన్నర్లకు చాలామందికి బౌలింగ్ తోపాటు పలు అంశాల్ని ఈజీ చేసేశాడంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇవి కాస్త సోషల్ మీడియాలో నెటిజన్స్ మధ్య డిస్కషన్ కు కారణమయ్యాయి.
‘ధోనీ కెప్టెన్సీలో ఆడుతున్నప్పుడు స్పిన్నర్లు అందరూ ఎంజాయ్ చేసేవారు. ఎందుకంటే స్పిన్ బౌలింగ్ విషయంలో చాలా వాటిని అతడు ఈజీ చేసేశాడు. బౌలర్ గా.. బౌలింగ్ తోపాటు ఫీల్డింగ్, బ్యాటర్ గురించి, గ్రౌండ్ పరిస్థితుల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అలాంటి టైంలో ధోనీ.. సదరు స్పిన్నర్ దగ్గర నుంచి ఏదో ఒకదాన్ని తీసుకునేవాడు. వాటిలో ఫీల్డ్ ప్లేస్ మెంట్, వికెట్ పరిస్థితులు.. ఇలా ఏదైనా ఒకటి ఉండేది. దీంతో బౌలర్లపై కాస్త భారం తగ్గేది. అందుకే మేం అందరం కూడా అప్పట్లో ధోనీ కెప్టెన్సీలో ఆడటం ఆస్వాదించేవాళ్లం. అలానే ఎంత ఒత్తిడి అయినా సరే మా వరకు రానిచ్చేవాడు కాదు. ఇక కుర్రాళ్లయితే చాలా స్వేచ్ఛగా ఆడనిచ్చేవాడు. ఈ విషయంలో అందరికీ ధోనీ చాలా సహాయం చేశాడు.’ అని ప్రజ్ఞాన్ ఓజా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. టీమిండియా తరఫున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టీ20లు ఓజా ఆడాడు. మరి ధోనీ గురించి ఓజా చెప్పిన మాటలపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
Just Another day of @pragyanojha talking about his captain 😉😎#MSDhoni • @msdhoni • #Dhoni pic.twitter.com/VQ2GKbh11q
— TELUGU MSDIANS🦁™ (@TeluguMSDians) February 13, 2023