యాషెస్ సిరీస్ అట్టహాసంగా ముగిసింది. ఇంగ్లాండ్ పై 4-0 తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. నాలుగో టెస్టు డ్రా మినహా మొత్తం నాలుగు టెస్టులలో ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్ ను మట్టి కరిపించింది. అంతటి ఘన విజయం నమోదు చేసిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని అంటాయి. అంబరాన్ని అంటడమే కాదు.. ఒకానొక సమయంలో శ్రుతి కూడా మించాయి. ఎంత అంటే పోలీసులు కలుగ జేసుకుని ఇంక మీ పార్టీ చాలు రూమ్ కు వెళ్లండి అని వార్నింగ్ ఇచ్చే అంత ఎక్కువైంది. ఇప్పుడు ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
The first and last time #Hobart will host an #Ashes test… ‘Bit too loud’ .. Awesome pic.twitter.com/zdZ4dmcsf6
— Matt de Groot (@mattdegroot_) January 18, 2022
ఆఖరి టెస్టు తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు హోబర్ట్ లోని హోటల్ లో బస చేశారు. ఆ హోటల్ రూఫ్ టాప్ పై వారంతా ఫుల్లుగా తాగి.. కేకలు వేస్తూ సంబరాలు చేసుకున్నారు. వారి అల్లరి శ్రుతిమించడంతో హోటల్ లో ఉన్నవారు సిబ్బందికి ఫిర్యాదు చేశారు. హోటల్ యాజమాన్యం పోలీసులను పిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు వచ్చి ఇంక పార్టీ చేసుకుంది చాలు.. రూమ్స్ కు వెళ్లండి. మీరు గొడవ చేస్తున్నట్లు మాకు కంప్లైంట్ వచ్చింది అంటూ వార్న్ చేశారు. వీడియోలో నాథన్ లైన్, రూట్, ట్రావిస్ హెడ్, అండర్సన్, అలెక్స్ కేరీ కనిపించారు. ఆ వీడియో మీరు ఓసారి చూసేయండి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.