టోక్యో ఒలింపిక్స్లో భారత్కు బంగారు పతకం సాధించి పెట్టిన నీరజ్ చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక అవార్డు లారెస్ స్పోర్ట్స్కు నామినేట్ అయ్యారు చోప్రా. మొత్తం ఏడు విభాగాల్లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లను ఈ అవార్డు కోసం నామినేట్ చేస్తుంటారు. కాగా ఈ అవార్డుకు భారత్ తరఫున నామినేట్ అయిన మూడో అథ్లెట్గా నీరజ్ చోప్రా నిలిచారు. ఇప్పటి వరకు వినేష్ ఫోగాట్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. వీరిలో సచిన్కు మాత్రమే ఈ అవార్డు లభించింది.
ఈ అవార్డు కోసం నీరజ్ చోప్రాతో పాటు రష్యన్ టెన్నిస్ ఆటగాడు.. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్గా నిలిచిన డానియెల్ మెద్వెదేవ్, వెనిజులా అథ్లెట్ యులిమర్ రోజస్, బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఎమ్మా రాడుక్కాను, స్పానిష్ ఫుట్బాలర్ పెడ్రీ, ఆస్ట్రేలియ సిమ్మర్ అరియార్నే టిట్మస్లు పోటీపడుతున్నారు. ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఏప్రిల్లో అవార్డు విజేతలను ప్రకటిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా 1,300 మంది స్పోర్ట్స్ జర్నలిస్టులు కలిసి.. ఏడు కేటగిరీల నుంచి ఆటగాళ్లను నామినేట్ చేశారు. మరి నీరజ్కు ఈ అవార్డు వరిస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.