టోక్యో ఒలింపిక్స్లో భారత్కు బంగారు పతకం సాధించి పెట్టిన నీరజ్ చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక అవార్డు లారెస్ స్పోర్ట్స్కు నామినేట్ అయ్యారు చోప్రా. మొత్తం ఏడు విభాగాల్లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లను ఈ అవార్డు కోసం నామినేట్ చేస్తుంటారు. కాగా ఈ అవార్డుకు భారత్ తరఫున నామినేట్ అయిన మూడో అథ్లెట్గా నీరజ్ చోప్రా నిలిచారు. ఇప్పటి వరకు వినేష్ ఫోగాట్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. […]