ఇండియన్ క్రికెట్ గాడ్గా పేరు తెచ్చుకున్న సచిన్ టెండూల్కర్ మరే భారత ఆటగాడికి సాధ్యంకాని రికార్డును నెలకొల్పాడు. ఏకంగా 6 ప్రపంచ కప్ టోర్నీల్లో(1992, 96, 99, 2003, 07, 11) పాల్గొని చరిత్ర లిఖించాడు. చాలా కాలంగా ఈ రికార్డు అలాగే ఉంది. తాజాగా సచిన్ రికార్డును సమం చేసింది భారత మహిళా జట్టు సారథి మిథాలీ రాజ్. ప్రస్తుతం న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్లో టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న మిథాలీ మొత్తం 6 ప్రపంచ కప్లో పాల్గొన్న సచిన్ రికార్డును సమం చేసింది. అలాగే నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాము ఆకాశంలో సగంతో పాటు క్రికెట్లో పురుషులతో సమం అంటూ మిథాలీ నెలకొల్పిన రికార్డు ధ్వనిస్తుంది.
మొదటి ప్రపంచ కప్ను 2000వ సంవత్సరంలో ఆడిన మిథాలీ అప్పటి నుంచి వెనుదిరిగి చూసింది లేదు. వరుసగా.. 2000, 2005, 2009, 2013, 2017, 2022 ప్రపంచ కప్లలో పాల్గొంది. ఇలా ఇండియన్ ఉమెన్స్ క్రికెట్కు తన సేవలను అందిస్తూ.. ఎందరో యువ క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. మన దేశంలో పురుషుల క్రికెట్కే ఎక్కువ ఆదరణ ఉంటుంది. క్రికెటర్లను డెమీ గాడ్స్ కూడా భావిస్తారు. అలాంటి ఆదరణ, ప్రొత్సాహం ఉన్న మేల్ క్రికెటర్స్లో సచిన్ తప్పా మరెవ్వరూ సాధించలేని రికార్డును మిథాలీ రాజ్ సాధించడం నిజంగా గొప్ప విషయం. మరి ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Sayyad Nag Pasha (@PashaNag) March 8, 2022