టీమిండియా క్రికెట్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్లే బౌండరీ లైన్కు తరలిస్తూ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా టెస్టు టీమ్లో ఆడే మయాంక్.. కర్ణాటకలో జరుగుతున్న మహారాజా ట్రోఫీలో తన కెరీర్లో సెకండ్ ఫాస్టెస్ సెంచరీతో దుమ్ములేపాడు. కేవలంఓ 49 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్సులతో 102 పరుగులు చేసి అదరగొట్టాడు.
ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరించిన మయాంక్ అంతగా రాణించలేకపోయాడు. బ్యాటింగ్లో దారుణంగా విఫలం అయ్యాడు. ఇక ఐపీఎల్ తర్వాత దేశవాళీ టోర్నీతో పాటు కర్ణాటకలో నిర్వహిస్తున్న మహారాజా ట్రోఫీలో కళ్యాణి బెంగుళూరు బ్లాస్టర్ జట్టుకు ఆడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం శివమొగ్గా స్ట్రైకర్స్తో జరిగిన మ్యాచ్లో సంచలన ఇన్నింగ్స్తో సెంచరీ బాది మహారాజా టోర్నీలో రెండో సెంచరీ నమోదు చేశాడు. అలాగే తన కెరీర్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీని కూడా నమోదు చేశాడు.
2020లో షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో మయాంక్ 45 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. అది ఐపీఎల్లోనే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శివమొగ్గా స్ట్రైకర్స్ 19 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ రోహన్ 52 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 84 పరుగులు చేసి రాణించాడు. లక్ష్యఛేదనకు దిగిన బెంగుళూరు బ్లాస్టర్స్కు మయాంక్ అగర్వాల్ ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. 49 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సులతో 102 పరుగులు చేసి.. 15.4 ఓవర్లలోనే మ్యాచ్ ముగించాడు. మరి మయాంక్ ఆడిన ఈ ఇన్నింగ్స్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The 𝐌 in 𝐌𝐕𝐏 stands for Mayank! 🤩#CaptainPunjab’s brilliant 102* (49) guides his team to an emphatic win 🔥#PunjabKings #MayankAgarwal #MaharajaTrophy #SaddaPunjab pic.twitter.com/JLCmOuGrSA
— Punjab Kings (@PunjabKingsIPL) August 12, 2022
ఇది కూడా చదవండి: ఎన్ని త్యాగాలు చేశానో ఎవరికీ తెలీదు.. పెద్ద యుద్ధమే చేశా: హార్దిక్ పాండ్యా