శ్రీలంక వేదికగా ప్రేమ్ దాస్ స్టేడియంలో భారత్ ఏ, పాకిస్థాన్-ఏ జట్ల మధ్య జరిగిన మ్యాచులో ఒక అద్భుతం చోటు చేసుకుంది. పాక్ కి షాకిస్తూ భారత్ ప్లేయర్ పట్టిన ఒక గ్రేట్ క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా మారింది.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక్క సీనియర్ క్రికెట్ జట్టే కాదు, ఉమెన్స్, జూనియర్ టీమ్స్ తలపడినా ఆ హైప్ అలాగే ఉంటుంది. మ్యాచ్ ఎక్కడ జరిగినా ఆటగాళ్లతో పాటు అభిమానులు మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు ..పాకిస్థాన్ జట్టు మీద సీనియర్ క్రికెట్ టీం, ఉమెన్స్ క్రికెట్ టీం ఆధిపత్యం చూపించడం ఇప్పటికీ మనం ఎన్నోసార్లు చూసి ఉంటాం. ఇప్పటివరకు మెన్స్ అయినా, ఉమెన్స్ అయినా దాయాదితో సమరం పూనకం వచ్చినట్లుగా ఆడతారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు కుర్రాళ్ళు కూడా పాకిస్థాన్ ని కుమ్మేసారు. ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా భారత్ ఏ-టీం, పాకిస్థాన్-ఏ టీంని ఘోరంగా ఓడించింది. ఘోరంగా ఓడించారు. ఇక ఈ మ్యాచులో సాయి సుదర్శన్ సెంచరీ హైలెట్ గా కనిపించినా.. ఒక్క క్యాచ్ తో బౌలర్ హర్షిత్ రానా అందరినీ అబ్బురపరిచాడు.
భారత్ క్రికెట్ లో ఒకప్పుడు ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉండేది. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టినా ఫీల్డింగ్ లో కాస్త బద్ధకంగా ఉండేవారు. కానీ క్రమంగా ఇండియన్ క్రికెట్ ఫీల్డింగ్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. యువరాజ్, కైఫ్ లాంటి ప్లేయర్స్ ఫీల్డింగ్ కి ఒక కొత్త మార్గాన్ని చూపిస్తే ప్రస్తుతం కుర్రాళ్ళు ఫీల్డింగ్ లో దుమ్మలేపుతున్నారు. నిన్న హర్షిత్ రానా పట్టిన క్యాచ్ దీనికి నిదర్శనం. పాకిస్థాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో క్వసీం అక్రమ్ ధాటిగా బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ సమయంలో బౌలర్ హంగ్రర్కెర్ వేసిన ఓవర్లో థర్డ్ మ్యాన్ వైపు బంతిని బలంగా కొట్టిన అక్రమ్ హర్షిత్ రానా పట్టిన అద్భుతమైన క్యాచ్ వలన పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. రానా బంతిని ఆందుకునే క్రమంలో గాల్లోకి ఎగరడమే కాదు శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకున్న తీరు అద్భుతం.
ఈ క్యాచ్ తో ఒక్కసారిగా దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ జంట రోడ్స్ ని గుర్తు చేసాడు హర్షిత్ రానా. గతంలో ఇలాంటి ఎన్నో అసాధ్యమైన క్యాచులని అందుకున్న ఘనత రోడ్స్ ది. రానా పట్టిన ఈ క్యాచ్ చూస్తుంటే ఈ ప్లేయర్ టీమిండియా జాంటీ రోడ్స్ లాగా కనిపిస్తున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే శ్రీలంక వేదికగా ప్రేమ్ దాస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో భారత్-ఏ టీం 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాక్ విధించిన 206 పరుగుల లక్ష్యాన్ని 36.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేజ్ చేసింది. ఇటీవలే అద్భుత ఫామ్ లో ఉన్న సాయి సుదర్శన్(104) సెంచరీతో చెలరేగగా.. నీకీ జోస్(53) అర్ధ సెంచరీతో రాణించాడు. బౌలింగ్ లో హంగ్రర్కెర్ 5 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. మొత్తానికి హర్షిత్ రానా తీసుకున్న గ్రేట్ క్యాచ్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
WHAT A CATCH, HARSHIT RANA 🔥pic.twitter.com/b8K27kZQ1y
— Johns. (@CricCrazyJohns) July 19, 2023