మైదానం అదే.. ప్రత్యర్థీ ఆ జట్టే.. గతేడాది టీ20 ప్రపంచకప్ లో ఓడిపోయింది. ఇప్పుడు అంతకు అంతా ప్రతీకారం తీర్చుకుంది. మరి ప్రతీకారం తీర్చుకుంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా.. అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు. దేశం మొత్తం సంబరాలు చేసుకుని ఫుల్ హంగామా చేశారు. అసలు టీమిండియాకు ఈ విజయం ఎందుకంత స్పెషల్? దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
మ్యాచ్ లందు భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ కి ఉండే క్రేజే వేరు. ఎందుకంటే ఇందులో ఆటకు మించిన ఎమోషన్ ఉంటుంది. 10 నెలల గ్యాప్ తర్వాత దాయాది జట్ల మధ్య మ్యాచ్ అంటే.. క్రికెటర్స్ కే కాదు ఇరుదేశాల అభిమానులు కూడా పండగే. అందుకు తగ్గట్లే మ్యాచ్ ఫుల్ కిక్ ఇచ్చింది. 2018లో జరిగిన ఆసియాకప్ని కొల్లగొట్టింది మనోళ్లే. ఇప్పుడు హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగింది కూడా మనవాళ్లే.
గతేడాది టీ20 ప్రపంచకప్లో భారత్-పాక్ తలపడ్డాయి. అది కూడా ఇదే దుబాయ్ గడ్డపై. ఆ మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. టీ20, వన్డే ప్రపంచకప్ మ్యాచుల్లో పాక్ చేతిలో భారత్ కి తొలి పరాజయం అదే. ఆ ఓటమి భారం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఇప్పుడు దెబ్బకు దెబ్బ కొట్టి కసితీరా రివేంజ్ తీర్చుకుంది. అంతకుమించిన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది. మరి ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తే.. ఫ్యాన్స్ ఊరుకుంటారా అస్సలు ఊరుకోరు.. వేరే ఏ దేశంపై మ్యాచ్ గెలిచినా కేవలం సంతోషపడి ఊరుకునే ఫ్యాన్స్.. పాక్ పై గెలిస్తే మాత్రం ప్రపంచకప్ గెలిచినంత ఆనందపడిపోతారు.
దానికి తగ్గట్లే బాణాసంచా కాల్చి, జాతీయ జెండాతో రోడ్లపై తిరుగుతూ విజయాన్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అద్భుత విజయాన్ని ఆస్వాదించారు. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా రోడ్లపైకి వచ్చి.. మ్యాచ్ గెలిచిన ఆనందాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇదిలా ఉండగా దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన పాక్ జట్టు.. 147 పరుగులకు ఆలౌటైంది. 43 పరుగులు చేసిన రిజ్వాన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. భువనేశ్వర్ 4, హార్దిక్ పాండ్య 3, అర్షదీప్ 2, ఆవేశ్ ఖాన్ 1 వికెట్ తీశారు.
అనంతరం బరిలోకి దిగిన భారత్ మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది. హార్దిక్ పాండ్య ఆల్ రౌండర్ ప్రదర్శనకి అభిమానులు ఫుల్ ఫిదా అయిపోయారు. ఈ విజయాన్ని భారత క్రికెట్ అభిమానులు రోడ్లపైకి వచ్చి టపాసులు కాల్చి మరి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. జాతీయ జెండాలతో బైక్ ర్యాలీలు సైతం నిర్వహించారు. ఈ విధంగా తమ సంతోషాన్ని చూపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.